E-Paper
Advertisement

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

Shreyas Iyer:  వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

Shreyas Iyer:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) పంజాబ్ కింగ్స్ జట్టును లీడ్ చేసిన శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అతనిపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో అతనికి వ్యతిరేకంగా కొంతమంది, అంపైర్ తో గొడవ పెట్టుకున్న వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఓ మ్యాచ్ సందర్భంగా అంపైర్ దగ్గరికి వచ్చి… తెగ రెచ్చిపోయాడు శ్రేయస్ అయ్యర్. బండ బూతులు కూడా అంపైర్ ను తిట్టాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ మంచి స్టేజ్ కు వెళ్లే క్రమంలో.. అనవసరంగా శ్రేయస్ అయ్యర్ వివాదంలో చిక్కుకున్నారని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Short Circuit, Smoke In Team Bus:  గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు ! 

సరికొత్త వివాదంలో శ్రేయస్ అయ్యర్

టి20 ముంబై 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ వర్సెస్ సోబో ముంబై ఫాల్కన్స్ ( Mumbai South Central Maratha Royals vs SoBo Mumbai Falcons, Final,) మధ్య జరిగింది. అయితే ఇందులో శ్రేయస్ అయ్యర్ టీం ఓటమిపాలైంది. అద్భుతంగా రాణించిన ముంబై సౌత్ సెంట్రల్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి… ఛాంపియన్ అయింది. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్ తీసుకున్న నిర్ణయం పట్ల సోబో ముంబై ఫాల్కన్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా సీరియస్ అయ్యాడు. ఈ సందర్భంగా అంపైర్ ను బండ బూతులు తిట్టాడు. ఈ ఘటన వైరల్ గా మారింది. అయితే అతి త్వరలోనే సూర్య కుమార్ యాదవ్ స్థానంలో టీమిండియా టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కాబోతున్న నేపథ్యంలో, కావాలని పాత వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారని ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏడాది కిందట జరిగిన సంఘటనను ఇప్పుడు ఎందుకు తిప్పుతున్నారని సీరియస్ అవుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ రాకుండా చేసే కుట్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సూర్య పై వేటు.. అయ్యర్ కు కెప్టెన్సీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ ను టి20 కెప్టెన్ చేస్తారని ప్రచారం సాగుతోంది. గత కొన్ని రోజులుగా సూర్య కుమార్ యాదవ్ ఆటగాడిగా విఫలమవుతున్నాడు. కానీ కెప్టెన్ గా మాత్రం మంచి విజయాలను నమోదు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో సూర్యను పక్కకు పెట్టి, శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇవ్వాలని బిసిసిఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. త్వరలో జరిగే ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టి20 సిరీస్ కు అతన్ని సెలెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  Inzamam-ul-Haq: ఇది ప‌క్కా ఫిక్సింగే.. కోహ్లీకి గుజ‌రాత్ బౌల‌ర్ల నెమ్మ‌దిగా బంతులు వేశారు Inzamam-ul-Haq !

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×