South Africa vs India, 3rd T20I: మూడో T20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అందరూ ఊహించినట్లుగానే… టీమిండియా బౌలర్లు విజృంభించడంతో… మూడవ టి20 లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 11 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది సూర్య కుమార్ సేన. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన సఫారీలు… కేవలం 208 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది సఫారీ జట్టు.
Also Read: South Africa vs India, 3rd T20I: బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా.. అవేశ్ ఖాన్ పై వేటు ?
Also Read: IND VS SA 3rd T20i: నేడు మూడో టీ20 మ్యాచ్..అభిషేక్ శర్మ ఔట్ ?
సౌత్ ఆఫ్రికా టాపార్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించకపోవడంతో… మూడో మ్యాచ్లో ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికాలో క్లాసెన్ ఒక్కడు మాత్రం 41 పరుగులు చేశాడు. కానీ అతన్ని… అర్షదీప్ వెనక్కి పంపాడు.
Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తిలక్ వర్మ 56 బంతుల్లో 107 పరుగులు చేయగా… అభిషేక్ శర్మ 50 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో ఈ టి 20 సిరీస్ లో 2-1 తేడాతో ముందంజలోకి వెళ్ళింది టీమిండియా.