Sunil Gavaskar ON Team India injury situation : టీమిండియా క్రికెట్ జట్టును గాయాలు వేధిస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( ( Indian Premier League tournament 2026) ముగియగానే, వరుసగా టీమిండియా క్రికెటర్లు గాయాల బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు. హార్థిక్ పాండ్యా, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, బుమ్రా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామంది క్రికెటర్ ను బెడ్ రెస్ట్ లో ఉన్నారు. అయితే టీమిండియా ప్లేయర్ల గాయలపై సునీల్ గవాస్కర్ స్పందించారు. అంతర్జాతీయ మ్యాచులు ఆడేటప్పుడు గాయపడిన క్రికెటర్లు.. ఐపీఎల్ ప్రారంభిస్తే మాత్రం కరోనా కంటే వేగంగా కోలుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు సునీల్ గవాస్కర్. ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందే కోలుకొని.. 100% ఫిట్నెస్ కూడా సాధిస్తారని బాంబు పేల్చారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల దగ్గర ఉన్న మెడికల్ స్టాఫ్ కు అంతటి అద్భుత శక్తులు ఉన్నాయి కావచ్చు అంటూ హేళన చేశారు.
టీమిండియా క్రికెటర్లు వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్లు గాయాల బారిన పడడం అనేది, పెద్ద డ్రామా అంటూ బాంబు పేల్చారు. ఐపీఎల్ టోర్నమెంట్ సందర్భంగా అద్భుతంగా ఆడిన క్రికెటర్లు.. జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినప్పుడు గాయాల బారిన పడుతున్నారని ఆరోపణలు చేశారు. కావాలనే వీళ్లు గాయాల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
రేపు పొద్దున ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మ్యాచులు మొదలవుతాయి అంటే… ప్రస్తుతం గాయాల వంకతో విశ్రాంతి తీసుకుంటున్న ఆటగాళ్లందరూ ఒక్కరోజులో సిద్ధమైపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యార్కర్ల కింగ్ బుమ్రా లాంటి వాళ్లయితే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం ముంబై ఇండియన్స్ జట్టు కోసం ఆడేందుకే ఉన్నట్లుగా అతడు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. టీమిండియా ఆడే మ్యాచ్లో సరిగ్గా ప్రదర్శన కూడా చేయడం లేదని ఫైర్ అయ్యారు. బుమ్రా స్థానంలో మరో క్రికెటర్ ను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League tournament) సందర్భంగా విదేశీ క్రికెటర్లు కూడా చాలామంది ఆడుతున్నారని సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఐపీఎల్ ఆడేటప్పుడు కొంతమంది క్రికెటర్లు గాయం పేరుతో విదేశాలకు వెళ్ళిపోతున్నారని మండిపడ్డారు. వచ్చిన కాంట్రాక్టు డబ్బులు తీసుకొని… తమ దేశాలకు విదేశీ క్రికెటర్లు వెళ్లి, ఫ్రాంచైజీ ఓనర్లను ముంచుతున్నారని సీరియస్ అయ్యారు. గాయాలు కాకుండా.. అయినట్లు డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి క్రికెటర్ల పై రెండు నుంచి ఐదు సంవత్సరాలపాటు బ్యాన్ విధించాల్సిందేనని కోరారు. దీంతో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.