Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్న పర్వాలేదు.. విరాట్ కోహ్లీకి మంచినీళ్లు ఇస్తూ.. బతికేస్తాడని.. అది తనకు సంతోషం అంటూ స్వస్తిక్ చికారా తండ్రి సురేంద్ర చికారా పేర్కొన్నారు. క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ప్రత్యేక పేజీలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అలాంటి క్రికెటర్ను తాను ఎప్పుడు చూడలేదని కొనియాడారు. విరాట్ కోహ్లీని తన కొడుకు స్వస్తిక్… దేవుడిలాగా ఆరాధిస్తాడని వెల్లడించారు. అలాంటి క్రికెటర్ కు తన కొడుకు… బెంగళూరు జట్టు తరఫున ఉంటూ మంచినీళ్లు సర్వ్ చేయడం తనకు ఆనందాన్ని… ఇచ్చిందని స్వస్తిక్ తండ్రి సురేంద్ర వెల్లడించారు. దీంతో సురేంద్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ ( Virat Kohli ) క్రేజ్ మామూలుగా లేదుగా
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత జట్టుకు సారధిగా ఎంపికైన విరాట్ కోహ్లీ… అతని అడుగుజాడల్లోనే నడిచాడు. ఎక్కడ కూడా… వెనకడుగు వేయకుండా జట్టును ముందుకు సాగించాడు. సచిన్ టెండూల్కర్ లాంటి… బడా ప్లేయర్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు విరాట్ కోహ్లీ. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ… ఐసీసీ టోర్నమెంట్ లో మాత్రం టీమిండియాను ఛాంపియన్గా నిలపలేకపోయాడు.
రికార్డు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ గా కూడా కొన్ని రోజులు కొనసాగి ఇప్పుడు ప్లేయర్గా ఉంటున్నాడు. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అలాంటి విరాట్ కోహ్లీ అంటే.. తన తోటి ప్లేయర్లు కూడా ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వస్తిక్ తండ్రి సురేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు విరాట్ కోహ్లీకి సేవ చేస్తే సరిపోతుందని.. పేర్కొన్నాడు. కోహ్లీకి సేవ చేసుకుంటూ ఉంటే… నాకు ఎంతో ఆనందంగా ఉంటుందని కూడా తెలిపాడు సురేంద్ర. ఇప్పటికీ కూడా కోహ్లీని దేవుడిలాగా తన కొడుకు ఆరాధిస్తాడని వెల్లడించారు.
బెంగళూరు తరఫున ఆడుతున్న స్వస్తిక్
ఐపీఎల్ టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు స్వస్తిక్. ఘజియాబాద్ కు సంబంధించిన స్వస్తిక్ రైట్ హ్యాండ్ బ్యాటర్. డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తూ… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఐపిఎల్ 2025 టోర్నమెంట్ సందర్భంగా జరిగిన మెగా వేలంలో 30 లక్షలకు స్వస్తిక్ ను కొనుగోలు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.