Kiren Rijiju: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు లద్దాఖ్ లో మంత్రి కాన్వాయ్కి ముందు వాహనం నదిలో పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నుంచి మంత్రి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను మంత్రి ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ కాన్వాయ్ సమయానికి వెళ్లిందని రాసుకొచ్చారు. అక్కడ చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా కాపాడారని ఆయన పోస్ట్ చేశారు.
లద్దాఖ్ లో నదిలో పడిపోయిన ట్రక్కు పైన ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వారిని రక్షించడానికి సహాయక చర్యలు జరుగుతుండగా కేంద్ర మంత్రి కిరణ్ ,ఆయన భద్రతా సిబ్బంది రోడ్డు పక్కన కనిపిస్తున్నారు.
ALSO READ: Jobs in Indian Railway: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 అప్రెంటీస్ పోస్టులు, ఇదే మంచి అవకాశం
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలా రాశారు. లద్దాఖ్ లోని ద్రాస్ సమీపంలో ఓ వాహనం మా కాన్వాయ్ కంటే కొంచెం ముందు నదిలో పడిపోయింది. అదృష్టవశాత్తూ మేము సమయానికి వచ్చాం.. ఈ ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అని కిరెన్ రిజిజు ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
Before reaching Drass in Ladakh, one vehicle fell into the river just ahead of our Convoy. Luckily, we were on time and both persons survived. https://t.co/23EfX6bcOd pic.twitter.com/0xkNkebcws
— Kiren Rijiju (@KirenRijiju) August 26, 2025