E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Tanveer Ahmed: బాబ‌ర్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేందుకే వైభ‌వ్ ఏజ్ దాస్తున్నారు

Tanveer Ahmed: బాబ‌ర్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేందుకే వైభ‌వ్ ఏజ్ దాస్తున్నారు
Advertisement

Tanveer Ahmed on Vaibhav:  15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) వైభవ్ అదరగొట్టాడు. సెంచరీలు అలాగే అర్థ సెంచరీలు నమోదు చేసి తోపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లకు వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ సెలెక్ట్ చేసింది. అయితే, ఐర్లాండ్ తో జరిగిన టి20 సీరియస్ సందర్భంగా వైభవ్ కు అవకాశం రాలేదు.. కానీ ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ నుంచే వైభవ్ ఆడతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోసారి చెబుతున్నా… వైభవ్ వయస్సు 15 సంవత్సరాలు కాదని… వాడి వయసు 20 నుంచి 22 సంవత్సరాలు ఉంటుందని ఆరోపణలు చేశారు. ఇదంతా కావాలనే టీమిండియా, బీసీసీఐ దాస్తోందని మండిపడ్డారు. బాబర్ ఆజం రికార్డులను బద్దలు కొట్టేందుకే.. ఈ కుర్రాడి వయసు దాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైభవ్ పై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Rajasthan-born Jai Moondra moved to Dublin : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

బాబ‌ర్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేందుకే వైభ‌వ్ ఏజ్ దాస్తున్నారు

Advertisement

15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అతడి ఆత్మవిశ్వాసం పై దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ వయస్సు 15 సంవత్సరాలు కాదని మరోసారి ఆరోపణలు చేశారు. అతని వయసుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పుడే అసలు రంగు బయట పడుతుందని బాంబు పేల్చాడు. బాబర్ ఆజం అతి తక్కువ వయస్సులోనే అనేక రికార్డులు క్రియేట్ చేశాడని తెలిపారు. అయితే ఆ రికార్డులను బద్దలు కొట్టేందుకు వైభవ్ సూర్యవంశీ వయస్సు తక్కువగా చెబుతున్నారని బిసిసిఐపై ఆరోపణలు చేశారు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాల్సిందే అని కుండబద్దలు కొట్టి చెప్పారు.

వైభవ్ తుది జట్టులో ఉన్నా, ఇండియా ఓడిపోయేది

ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా (IND VS IRE) మధ్య జరిగిన టి20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ ఆడి ఉంటే, శ్రేయస్ అయ్యర్ సేన గెలిచేదని చాలామంది ప్రచారం చేస్తున్నారు. అయితే దీన్ని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ఖండించారు. అదంతా ఫేక్ అని.. అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. వైభవ్ సూర్య వంశీ తుది జట్టులో ఉన్నప్పటికీ కూడా టీమిండియా గెలిచేది కాదన్నారు.

Advertisement

Also Read: Muhammad Waseem Blames Team India టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

Related News

సూర్య పెద్ద పోటుగాడా ? వాడి కెప్టెన్సీలోనూ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయేవాళ్లం

కావ్య పాప‌కు బిగ్ షాక్‌..పోర్చుగ‌ల్ టీమ్ కు వెళ్లిపోనున్న SRH ప్లేయ‌ర్‌

Abid Ali: టీమిండియా ఓడిన ప్ర‌తీరోజు పాకిస్తాన్ లో రంజాన్ పండగే

Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

5 కేజీల‌ పొట్ట ఉన్నా వైభ‌వ్ ను ఆడిస్తున్నారు..క‌మ్రాన్ అక్మ‌ల్ సంచ‌ల‌నం !

టీమిండియా ఛాప్ట‌ర్ క్లోజ్‌..నెక్ట్స్‌ పాకిస్తాన్, ఐర్లాండ్ కొత్త షెడ్య‌ల్ ఇదే

టీమిండియాలో ముంబై వాళ్ల‌కే అవ‌కాశాలు.. బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్లేయ‌ర్ల‌కు నో ఛాన్స్ ?

Big Stories

×