David Warner On Happy Independence Day: ఆగస్టు 15వ తేదీ.. భారత దేశ చరిత్రలో నిలిచినపోయిన రోజు. ఈ రోజునే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 80 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే శనివారం రోజున దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ జెండాను ఆవిష్కరించారు. అటు రాష్ట్రపతితో పాటు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గ్రామ స్థాయిలో సర్పంచులు కూడా జెండాను ఆవిష్కరించి, వేడుకలు చేసుకున్నారు. అయితే ఈ ఇండిపెండెన్స్ నేపథ్యంలో విదేశీ క్రికెటర్లు కూడా మనవాళ్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కెవిన్ పీటర్సన్… భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలపగా.. డేవిడ్ వార్నర్ సైతం సోషల్ మీడియా వేదికగా జాతీయ జెండాను షేర్ చేశారు. భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భారతదేశ ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ డేవిడ్ వార్నర్ చేసిన పోస్ట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విదేశీ క్రికెటర్లు ఎవరు శుభాకాంక్షలు చెప్పిన స్వాగతించాల్సిందేనని… కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ఈ శుభాకాంక్షలు తెలపడానికి అనర్హుడు అంటూ ఫైర్ అవుతున్నారు. మొన్నటి వరకు పాకిస్తాన్ కు సపోర్ట్ గా ఉన్న డేవిడ్ వార్నర్… భారతదేశ జాతీయ జెండా ఎగురవేసే హక్కును కోల్పోయాడని మండిపడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నమెంట్ ను కాదని, పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడిన ప్రతి ఒక్కడు… మన భారతదేశానికి శత్రువే అని పేర్కొంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడి.. ఇండియాను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ ద్వారా పేరు ప్రఖ్యాతలు సాధించి, పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడడం దుర్మార్గం అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటోడు శుభాకాంక్షలు చెబితే, ఎవరూ కూడా ఆ రియాక్ట్ కాకూడదని కోరుతున్నారు. పాకిస్తాన్ వేసే బిస్కెట్లు తినే కుక్కలు అంటూ విమర్శలు చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ద్వారా డేవిడ్ వార్నర్ చాలా పాపులర్ అయ్యాడు అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు 2016 సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టును ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాత హైదరాబాద్ అతడిని వదిలి వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. అక్కడ కూడా పెద్దగా ప్రదర్శన చేయకపోవడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ లో దర్శనం ఇచ్చాడు వార్నర్. ఈ క్రమంలో ఇండియన్ ఫాన్స్ ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.