Ramiz Raja On AUS VS BAN: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో ఆగస్టు 13వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఈ టెస్ట్ లో ఆది నుంచి బంగ్లాదేశ్ పై చేయి సాధిస్తుంది. అంతేకాదు ఇప్పటివరకు మూడు రోజులు పూర్తికాగా.. 70 శాతం బంగ్లాదేశ్ విక్టరీ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేవలం 20 నుంచి 30% మాత్రమే ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి రిజల్ట్ రావడం మాత్రం గ్యారెంటీ. మ్యాచ్ డ్రా అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి క్రమంలో బంగ్లాదేశ్ క్రికెటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ( Ramiz Raja ). ఇప్పుడే సంబరాలు చేసుకోవద్దని.. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళితే ఆస్ట్రేలియా పుంజుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మ్యాచ్ ఫినిష్ అయ్యేవరకు బంగ్లాదేశ్ క్రికెటర్లు పోరాటం చేయాల్సిందేనని.. రిలాక్స్ కాకూడదు అని కోరారు. ఒక్క రోజులో మ్యాచ్ స్వరూపమే మార్చే శక్తి ఆస్ట్రేలియాకు ఉందన్నారు.
ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ( Ramiz Raja ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ విక్టరీ కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తే మాత్రం ఆస్ట్రేలియా మళ్లీ పుంజుకుంటుందని హెచ్చరించారు. ఆస్ట్రేలియా పుంజుకుంటే 5వ రోజు వరకు మ్యాచ్ వెళుతుందని వ్యాఖ్యానించారు. మరో 6 వికెట్లు ఉన్నాయి కాబట్టి.. మిగతా బ్యాటర్లందరూ రాణించి బంగ్లాదేశ్ ముందు భారీ స్కోర్ పెట్టే ప్రమాదం కూడా ఉంటుందని పేర్కొన్నారు. రెండు నుంచి 300 టార్గెట్ పెడితే మాత్రం ఆస్ట్రేలియా చేతిలోకి మ్యాచ్ వెళుతుందని హెచ్చరికలు జారీ చేశారు రమీజ్ రాజా.
రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 300 పరుగుల టార్గెట్ ను బంగ్లాదేశ్ ముందు ఉంచితే.. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని రమీజ్ రాజా వెల్లడించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లను రెండో ఇన్నింగ్స్ లో త్వరగా అలౌడ్ చేసే సత్తా కంగారు బౌలర్ల దగ్గర ఉందన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో విఫలమైనప్పటికీ.. రెండో ఇన్నింగ్స్ లో పాట్ కమ్మిన్స్ సేన దూకుడుగా ముందుకు వెళుతుందని వార్నింగ్ ఇచ్చారు రమీజ్ రాజా. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అప్పుడే మ్యాచ్ గెలుస్తారన్నారు. ముందే సంబరాలు చేసుకోవద్దని కోరారు.