Danish kaneria On pakistan cricketers: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా గురించి తెలియని వారు ఉండరు. పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన కనేరియా… నిత్యం ఇండియాకు సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. గుజరాత్ లో డానిష్ కనేరియా ( Danish kaneria ) పూర్వికులు ఉండేవారు. 1970 తర్వాత పాక్ లోని కరాచీకి అతని కుటుంబం వలస వెళ్ళింది. అందులోనూ కనేరియా హిందూ కుటుంబానికి సంబంధించిన వాడు. అందుకే ఇండియా అంటే గౌరవంతో కనేరియా మాట్లాడుతూ ఉంటారు. అయితే పాకిస్తాన్ జట్టులో కనేరియా ఉన్నప్పుడు.. చాలా సార్లు అతడిని అవమానించారు తోటి క్రికెటర్లు. ఇప్పటికి కూడా అదే ట్రోలింగును ఎదుర్కొంటున్నాడు కనేరియా.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ( Danish kaneria ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దేశంలో తనకు భద్రత లేదని బాంబు పేల్చారు. ఇండియాకు తాను అనుకూలంగా మాట్లాడినందుకు… టార్గెట్ చేస్తున్నట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు అనుకూలంగా మాట్లాడినందుకు.. తనపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టులో ఉన్నప్పుడు కూడా తనను ఇలాగే కొంతమంది తన తోటి క్రికెటర్లు వ్యవహరించారని ఆరోపణలు చేశారు. తాను హిందువు కాబట్టి.. టార్గెట్ చేసినట్లు వివరించారు.
తన పూర్వీకులు ఇండియాకు సంబంధించిన వారన్న ఒక్క కారణంతో, ప్రతిసారి డ్రెస్సింగ్ రూమ్ లో అవమానాలను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా టార్గెట్ చేస్తూనే ఉన్నారని బాంబు పేల్చారు. తాను తరచూ ఇండియాకు అనుకూలంగా మాట్లాడతానని… కొంతమంది పాకిస్తాన్ వెధవలు తనపై దేశద్రోహి ముద్ర వేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన కుటుంబం గుజరాత్ ప్రాంతం నుంచి ఎప్పుడో పాకిస్తాన్ కు వలస వచ్చిందని గుర్తు చేశారు కనేరియా. కానీ, తాను పుట్టినప్పటినుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలు చేయలేదని వెల్లడించారు. ఎల్లప్పుడూ పాకిస్తాన్కు పూర్తి నిజాయితీతో.. గర్వంతో ప్రాతినిధ్యం వహించానని తెలిపారు. కానీ, ఇండియాకు అప్పుడప్పుడు అనుకూలంగా మాట్లాడినందుకు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.
పాకిస్తాన్ దేశంలో పుట్టి పెరిగిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. నిత్యం హిందువు భారతదేశాన్ని ప్రశంసిస్తూనే, ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. హిందూ ధర్మాన్ని కాపాడే శ్రీరామచంద్రుడు అంటూ నిత్యం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంటారు. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేసినప్పుడు కూడా.. ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ గా నిలిచారు.