Kumar Sangakkara On Jaiswal run out: టీమిండియా వర్సెస్ శ్రీలంక ( Sri Lanka vs India ) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( India tour of Sri Lanka 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలోని గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ( Galle International Stadium, Galle) వేదికగా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభమైంది. మధ్య మధ్యలో వర్షం పడినప్పటికీ.. ఎలాంటి అంతరాయం కలగలేదు. ఈ క్రమంలో టీ బ్రేక్ సమయం వరకు 200 కు పైగా పరుగులు చేసిన టీమిండియా ఒకే ఒక్క వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం కెఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ చేస్తున్నారు.
శ్రీలంక వర్సెస్ టీమిండియా ( Sri Lanka vs India ) మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైన నేపథ్యంలో కుర్ర క్రికెటర్ యశస్వి జైస్వాల్ వివాదాస్పద రనౌట్ ( Yashasvi Jaiswal run out) అయ్యాడు. 37 బంతుల్లో 32 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, ఆరోగ్య రీతిలో రన్ అవుట్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. క్రీజులో ఉన్న కే ఎల్ రాహుల్ బౌలర్ వైపు నేరుగా షాట్ ఆడాడు. ఈ క్రమంలోనే పరుగు కోసం వెళ్ళాడు. అయితే ఆ బంతిని అడ్డుకునేందుకు బౌలర్ కేశర నువాంత ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నాన్ స్ట్రైకింగ్ లో ఉన్నయశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal) కింద పడిపోయాడు.
ఇంకేముంది ఫీల్డర్ ప్రభాత్ జయ సూర్య బంతిని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా వైపు విసిరాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ ధనుంజయ అనుమతితో రనౌట్ చేశాడు శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ రన్ అవుట్ కు కారణం కేఎల్ రాహుల్ అని కొంతమంది అంటుంటే.. మరికొంతమంది ఈ లంక క్రికెటర్లను తప్పుపడుతున్నారు. సంజయ్ మంజ్రేకర్ లాంటివాళ్ళు యశస్వి జైస్వాల్ అలసత్వం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
యశస్వి జైష్వాల్ రన్ అవుట్ అయిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ కోచ్, మాజీ శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర ( Kumara sangakkara) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా యశస్వి జైస్వాల్ ను లంక ప్లేయర్లు అవుట్ చేశారని మండి పడ్డారు. ఏ మాత్రం వాళ్లకు క్రీడా స్ఫూర్తి లేదని సీరియస్ అయ్యారు. లంక బౌలర్ కారణంగానే యశస్వి జైస్వాల్ కింద పడిపోయాడు అన్న విషయాన్ని మర్చిపోయి… రనౌట్ ( Yashasvi Jaiswal run out) చేయడం దుర్మార్గమన్నారు.