IND VS SA 2nd Test: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 2nd Test ) మధ్య ఎల్లుండి అంటే నవంబర్ 22వ తేదీ నుంచి 2వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు గౌహతి చేరుకున్నారు. ఎల్లుండి బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా ( Barsapara Cricket Stadium, Guwahati) ఉదయం 9 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ నుంచి నేరుగా గౌహతి వెళ్లారు టీమిండియా ప్లేయర్లు. ఈ సందర్భంగా కొత్త జెర్సీలో సందడి చేశారు టీమిండియా ప్లేయర్లు.
Also Read: Hardik Pandya: ఆగలేకపోతున్న హార్దిక్ పాండ్యా, జిమ్ లోనే శృ**గారం..బోల్డ్ ఫోటోలు వైరల్ !
దక్షిణాఫ్రికా తో రెండో టెస్ట్ కోసం గౌహతి చేరుకున్న టీమిండియా ప్లేయర్లు.. విమానాశ్రయంలో కనిపిందు చేశారు. అయితే ఈ సందర్భంగా కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు మెరవడంతో వాళ్ల ఫోటోలు వైరల్ గా మారాయి. కొత్త జెర్సీలో టీమ్ ఇండియా ప్లేయర్లు కనిపించడంతో దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది. అచ్చం ఆస్పత్రిలో నర్స్ పాపల లాగానే టీమిండియా ప్లేయర్లు ఉన్నారని సెటైర్లు పేల్చుతున్నారు. వాళ్లు వేసుకున్న జెర్సీ కూడా స్కై బ్లూ కలర్ లో ఉంది. ఇది అచ్చం ఆస్పత్రులలో నర్సులు వేసుకునే యూనిఫాం లాగానే కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. అటు మొదటి టెస్ట్ సందర్భంగా మెడ గాయం బారిన పడ్డ గిల్ కూడా టీమిండియా ప్లేయర్లతో పాటు గౌహతి చేరుకున్నాడు. ఈ సందర్భంగా మెడకు పట్టి వేసుకొని మరి దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆ పట్టి తీసేసి, కళ్ళ జోడు పెట్టుకున్నాడు. దీంతో గిల్ కోలుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. గిల్ ఎలాగైనా రెండో టెస్ట్ లో ఆడాలని అంటున్నారు.
టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఆరోగ్యంపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ టెస్ట్ సందర్భంగా రెండో రోజు కెప్టెన్ గిల్ మెడకు గాయమైనట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఆరోజు ఆట ముగిశాక అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించామని తెలిపింది. తర్వాత రోజు గిల్ డిశ్చార్జ్ చేసినట్లు వివరణ ఇచ్చింది. ఇక చికిత్సకు ఆయన శరీరం బాగానే స్పందిస్తుందని వెల్లడించింది. ఇక ఇవాళ టీమిండియాతో కలిసి గౌహతి వెళ్లాడని తెలిపింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. మెడికల్ టీం పర్యవేక్షణలో గిల్ ఉంటాడని, దానికి అనుగుణంగా రెండు టెస్టులు వాడడంపై నిర్ణయం తీసుకుంటామని వివరణ ఇచ్చింది. నవంబర్ 21వ తేదీన గిల్ ఆడడంపై క్లారిటీ వస్తుందని వెల్లడించింది. ఒకవేళ గిల్ ఆడకపోతే సాయి సుదర్శన్ తుది జట్టులో స్థానం సంపాదించుకుంటాడని తెలుస్తోంది.
Also Read: Sania Mirza: షోయబ్ మాలిక్ కొడుకు పుట్టుకపై అనుమానాలు.. సానియా మీర్జా సంచలన వ్యాఖ్యలు ?
Shubman Gill, KL Rahul, Yashasvi Jaiswal, Rishabh Pant, and Team India have arrived in Guwahati ahead of the 2nd Test vs South Africa. pic.twitter.com/2dj1yVnAf1
— sonu (@Cricket_live247) November 19, 2025