Virat Kohli : ఐపీఎల్ 2025 సీజన్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవ్వరూ అస్సలు ఊహించలేకపోతున్నారు. ఏ జట్టు ఎప్పుడూ ఎలా ఆడుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. క్వాలిఫయర్ 1 లో ఊహించని విధంగా పంజాబ్ కింగ్స్ 101 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇక అదే క్వాలిపయర్ 2లో ముంబై ఇండియన్స్ జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్ జట్టు పుంజుకొని ఫైనల్ రేస్ లోకి వచ్చేసింది. ఫైనల్ లో అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జూన్ 03వ తేదీ మంగళవారం జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఈ సీజన్ ట్రోఫీని గెలుచుకుంటుంది.
Also Read : Shreyas Iyer : మీరు నా ముందు పిల్ల బచ్చాలు… ముంబైని అవమానించిన అయ్యర్.. చూయింగ్ గమ్ ఉమ్మేస్తూ
ఇదిలా ఉంటే.. నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ కి రాయల్ ఛాలెంజర్స్ జట్టు కి చెందిన కీలక ఆటగాడు రహస్యంగా విచ్చేసి మ్యాచ్ ని వీక్షించడం విశేషం. అది కెమెరా కి చిక్కాడు. ప్రస్తుతం ఆ ఆటగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందరూ చూస్తారని భావించి.. ముఖానికి మాస్క్ ధరించడం విశేషం. అసలు ఆ ఆటగాడు రహస్యంగా రావాల్సిన అవసరం ఏం వచ్చింది..? అని అంతా ఆశ్యర్యపోవడం విశేషం. అతని పేరు చెబితే ఎక్కడికీ వెళ్లినా.. ఎక్కడికీ అయినా అభిమానులు విపరీతంగా వస్తుంటారు. అలాంటి క్రీడాకారుడు ఇలా మ్యాచ్ కి రావడంతో ఆ జట్టు ఆటగాళ్లను వదిలేసి.. ఈ జట్టు ఆటగాడి కి ఆటో గ్రాఫ్ అడుగుతుంటారు. అలా తెలిసి కూడా ఆ క్రికెటర్ మ్యాచ్ వీక్షించేందుకు ఎలా వచ్చాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.
ఇదిలా ఉంటే.. పంజాబ్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ విఫలం చెందాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ లో ఆశించిన మేరకు రాణించలేదు. దీంతో ముంబై జట్టు 20 ఓవర్లలో 203 పరుగులు చేయగలిగింది. లక్ష్య ఛేదనలోకి బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 19 ఓవర్లలోనే 207 పరుగులు చేసింది. ఒక మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేయడం విశేషం. ఇలాంటి క్లిష్టమైన మ్యాచ్ లో ఇలా విజయం సాధించడం పట్ల పంజాబ్ కింగ్స్ కెప్టెన్.. జట్టు పట్ల పలువురు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు ఎక్కువగా ఉండే ముంబై ఇండియన్స్ జట్టును మట్టిలో కరిపించడం గొప్ప విషయం అని చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ కి చేరుకుంటే ఆర్సీబీ జట్టు టైటిల్ విజయం సాధించదని.. ఆర్సీబీ టైటిల్ విజయం సాధించడానికే ముంబై ఇండియన్స్ ఓడిపోయిందని రకరకాల కామెంట్స్ చేయడం విశేషం.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 1, 2025