E-Paper
Advertisement

Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?

Virat Kohli – RCB: ఇది కదా తెలుగోడి అభిమానం అంటే.. విరాట్ కోహ్లీ కోసం ఏం చేశాడంటే?

Virat Kohli – RCB: విరాట్ కోహ్లీ.. ఈ పేరే ఓ బ్రాండ్. కోహ్లీ చూడడానికి ఎంత అగ్రెసివ్ గా కనిపిస్తాడో.. అంతే అగ్రెసివ్ గా ఆడతాడు. తనదైన ఆటతీరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఓ చెరిగిపోని గుర్తింపు ఉంది. ఈయన పేరు తెలియని వారు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను తన క్రికెట్ ఆటతో మెప్పించి.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ.

Also Read: Brydon Carse – SRH: టీమిండియాను వణికించిన SRH ప్లేయర్‌.. ఫుల్‌ జోష్‌ లో కావ్యా పాప !

అయితే సొంత ఇల్లు కలిగి ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సహకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతుంటారు. తమ కలలకు, అభిరుచులకు సరిపోయే విధంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఓ తెలుగు వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటిపై రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పేరు, అలాగే విరాట్ కోహ్లీ బొమ్మని వేసుకొని తన అభిమానాన్ని చాటుకున్నాడు.

నూతనంగా నిర్మించుకుంటున్న తన ఇంటి ఎలివేషన్ పై కుడి వైపున విరాట్ కోహ్లీ బొమ్మతోపాటు.. ఆ ఫోటో కింద రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పేరుని లిఖించాడు. దీంతో ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన విరాట్ కోహ్లీ అభిమానులు.. ” క్రికెట్ లో అందరికీ అభిమానులు ఉంటారు కానీ.. విరాట్ కోహ్లీకి మాత్రమే భక్తులు ఉంటారు అని మరోసారి రుజువయ్యింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విరాట్ కోహ్లీ కూడా ఇటీవల ముంబైలో తన డ్రీమ్ హౌస్ ని దగ్గరుండి మరీ నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముంబైలోని అలీబాగ్ లో ఈ ఇంటిని నిర్మించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఏకంగా ఈ ఇంటికి 34 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక ఆర్కిటెక్చర్ కి అద్దం పట్టేలా ఈ ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేయబోతున్నాడు.

Also Read: Tilak Varma: తెలుగోడు సరికొత్త చరిత్ర…కోహ్లీ, మార్క్ చాప్మన్ రికార్డు బద్దలు !

జనవరి 31 తేదీన రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ ఏడబోతున్నాడు. ఇందుకోసం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఈ మ్యాచ్ జరగబోతున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో పదివేల మంది ప్రేక్షకులను విరాట్ కోహ్లీ బ్యాటింగ్ని ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఏ). అంతేకాదు అవసరమైతే మిగిలిన స్టాండ్ల గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా అభిమానుల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ భద్రతను కూడా పెంచబోతున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by cricket & Movie lover (@cricket_trends_telugu)

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×