Virat Kohli On Dhurandhar 2: బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ‘ధురంధర్-2’ సినిమా ( Dhurandhar 2) హవా కొనసాగుతూనే ఉంది. గత నెలలో ఉగాది సందర్భంగా రిలీజ్ అయిన ‘ధురంధర్-2’ బంపర్ విక్టరీ అందుకుంది. ఇప్పటికే 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది ఈ ‘ధురంధర్-2’ సినిమా. అయితే ఈ సినిమాను ఉద్దేశించి, తాజాగా అనుష్క శర్మ అలాగే టీమ్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి సినిమాటిక్ అనుభవాన్ని ఇండియాలో ఎప్పుడూ చూడలేదని కొనియాడారు విరాట్ కోహ్లీ దంపతులు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ, తాజాగా ‘ధురంధర్-2’ సినిమా తిలకించారు. తన భార్య అనుష్క శర్మతో పాటు ఈ సినిమాను చూశారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ దంపతులు ‘ధురంధర్-2’ సినిమాపై రివ్యూ ఇవ్వడం జరిగింది. దర్శకుడు ఆదిత్య ధర్ చాలా జీనియస్ అని.. విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియాలో స్టోరీ కూడా పెట్టడం జరిగింది. రణ్ వీర్ సింగ్ ( Ranveer Singh ) నటన సినిమాకు చాలా బలాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో రణ్ వీర్ సింగ్ మరో రేంజ్ కి వెళ్తారని అంచనా వేశారు విరాట్ కోహ్లీ.
ప్రేక్షకులను కట్టిపడేసేలా దాదాపు నాలుగు గంటల పాటు నిడివి గల సినిమా తీయడం సాధారణ విషయం కాదని అనుష్క శర్మ బాంబు పేలిచారు. రణ్ వీర్ సింగ్ కెరీర్ లో ఈ సినిమా పెద్ద హిట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అతనికి భవిష్యత్తులో మరింత మంచి పేరు రావాలని కోరారు. దీంతో అనుష్క శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇచ్చిన రివ్యూలు వైరల్ గా మారాయి. అటు ఇప్పటికే టీమ్ ఇండియా జట్టుకు సంబంధించిన క్రికెటర్లు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని లాంటి వాళ్లు కూడా ఈ సినిమాను తిలకించారు.
మార్చి 28వ తేదీన ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament) ఫుల్ బిజీగా ఉన్నాడు విరాట్ కోహ్లీ. మొన్నటి వరకు లండన్ లోనే ( London) ఉన్న విరాట్ కోహ్లీ దంపతులు.. ఐపీఎల్ ప్రారంభం కాగానే ఇండియాకు షిఫ్ట్ అయ్యారు. దాదాపు 3 నెలల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఇక అటు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB TEAM) జట్టు కూడా అద్భుతంగానే రాణిస్తోంది.