E-Paper
Advertisement

Sehwag On Zinta: ఇక‌నైనా హ‌గ్గులు ఇవ్వ‌డం మానేసి, పంజాబ్ ప్లేయ‌ర్ల‌కు వార్నింగ్ ఇవ్వండి !

Sehwag On Zinta: ఇక‌నైనా హ‌గ్గులు ఇవ్వ‌డం మానేసి, పంజాబ్ ప్లేయ‌ర్ల‌కు వార్నింగ్ ఇవ్వండి !
Advertisement

Sehwag On Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు జట్లు ఎలిమినేట్ కాగా.. ప్లే ఆఫ్స్ కోసం టైట్ ఫైట్ జరుగుతోంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు అలాగే గుజరాత్ టైటాన్స్ దాదాపు తమకు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. స‌న్ రైజ‌ర్స్‌ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారయింది. సీజన్ ప్రారంభంలో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు మాత్రం వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

హ‌గ్గులు ఇవ్వ‌డం మానేసి, పంజాబ్ ప్లేయ‌ర్ల‌కు వార్నింగ్ ఇవ్వండి !

Advertisement

అయితే ఇలాంటి క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి జింటా (PRITY ZINTA) ఇకపై హగ్గులు ఇవ్వడం మానేసి.. పంజాబ్ క్రికెటర్లను గాడిలో పెట్టాలని చురకలు అంటించారు. సిక్సర్ లేదా బౌండరీ కొట్టగానే ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, మ్యాచ్ గెలిచిన తర్వాత హగ్గులు ఇవ్వడం మానేసి.. ప్లే ఆఫ్స్ వెళ్లడం పైన దృష్టి సారించాలని దారుణంగా కామెంట్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఓనర్ సరైన బాటలో ఉంటే ప్లేయర్లు కూడా సక్రమంగా ఆడతారని కీలక సూచనలు చేశారు. ఇప్పటికైనా పంజాబ్ కింగ్స్ ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి బరిలో దింపాలని కోరారు. కచ్చితంగా సక్సెస్ వస్తుందని పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్లను కూర్చోబెట్టి అందరికీ దిశా నిర్దేశం చేయాలన్నారు. చివరి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా పంజాబ్ గెలవాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఎలా ?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (IPL 2026) నేపథ్యంలో పాయింట్లు పట్టికలో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది. తన తర్వాతి రెండు మ్యాచ్ లలో పంజాబ్ కింగ్స్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరు పైన మే 17వ తేదీన ధర్మశాల వేదికగా ఒక మ్యాచ్ ఉండగా.. మే 23వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ తో మరో మ్యాచ్ ఉంది. ఈ రెండిటిలో కచ్చితంగా రెండు గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్స్ వెళ్తుంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్ చేతులు ఎత్తేస్తే చెన్నై సూపర్ కింగ్స్ లేదా రాజస్థాన్ రాయల్స్ కు అవకాశం ఉండనుంది.

Advertisement

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×