Sehwag On Zinta: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు జట్లు ఎలిమినేట్ కాగా.. ప్లే ఆఫ్స్ కోసం టైట్ ఫైట్ జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే గుజరాత్ టైటాన్స్ దాదాపు తమకు బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారయింది. సీజన్ ప్రారంభంలో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు మాత్రం వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఇలాంటి క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి జింటా (PRITY ZINTA) ఇకపై హగ్గులు ఇవ్వడం మానేసి.. పంజాబ్ క్రికెటర్లను గాడిలో పెట్టాలని చురకలు అంటించారు. సిక్సర్ లేదా బౌండరీ కొట్టగానే ఫ్లయింగ్ కిస్సులు ఇవ్వడం, మ్యాచ్ గెలిచిన తర్వాత హగ్గులు ఇవ్వడం మానేసి.. ప్లే ఆఫ్స్ వెళ్లడం పైన దృష్టి సారించాలని దారుణంగా కామెంట్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఓనర్ సరైన బాటలో ఉంటే ప్లేయర్లు కూడా సక్రమంగా ఆడతారని కీలక సూచనలు చేశారు. ఇప్పటికైనా పంజాబ్ కింగ్స్ ప్లేయర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి బరిలో దింపాలని కోరారు. కచ్చితంగా సక్సెస్ వస్తుందని పేర్కొన్నారు. పంజాబ్ కింగ్స్ ప్లేయర్లను కూర్చోబెట్టి అందరికీ దిశా నిర్దేశం చేయాలన్నారు. చివరి రెండు మ్యాచ్ లలో కచ్చితంగా పంజాబ్ గెలవాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (IPL 2026) నేపథ్యంలో పాయింట్లు పట్టికలో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ పరిస్థితి చాలా క్లిష్టతరంగా మారింది. తన తర్వాతి రెండు మ్యాచ్ లలో పంజాబ్ కింగ్స్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరు పైన మే 17వ తేదీన ధర్మశాల వేదికగా ఒక మ్యాచ్ ఉండగా.. మే 23వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ తో మరో మ్యాచ్ ఉంది. ఈ రెండిటిలో కచ్చితంగా రెండు గెలిస్తేనే నేరుగా ప్లే ఆఫ్స్ వెళ్తుంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్ చేతులు ఎత్తేస్తే చెన్నై సూపర్ కింగ్స్ లేదా రాజస్థాన్ రాయల్స్ కు అవకాశం ఉండనుంది.
🚨 VIRENDAR SEHWAG ADVICE ON PBKS OWNER PRITY ZINTA !🤯
Virendar Sehwag Said 🗣️,
"Now is not the time to create problems with the coach or the captain. The team needs to win the last two matches to qualify. Everyone should support and motivate the players so they can win those… pic.twitter.com/86ni8qkdhf
— lndian Sports Netwrk (@IS_Netwrk29) May 15, 2026