Virender Sehwag: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి 10 గంటలకు తొలి టి20 మ్యాచ్ షురూ అయింది. ఇందులో టాస్ నెగ్గిన టీమిండియా 189 పరుగులు సాధించింది. అయితే చేజింగ్ కు ఇంగ్లాండు దిగక ముందే వర్షం జోరు అందుకుంది. ఎంతసేపు వేచి చూసినా కూడా వర్షం తగ్గలేదు. ఈ క్రమంలోనే, టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన తొలి టీ 20 రద్దు అయింది. అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ (Tilak Varma) ఆట తీరుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్ అయ్యారు. టి20 లను టెస్ట్ క్రికెట్ లాగా ఆడుతున్నాడని తిలక్ వర్మపై మండిపడ్డారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (babar azam) కంటే దారుణంగా తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నాడని పరువు తీశారు. దీంతో తిలక్ వర్మ పైన వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Team India) మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ విఫలమైన సంగతి తెలిసిందే. వైస్ కెప్టెన్ గా ఉన్న తిలక్ వర్మ 13 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే సాధించాడు. అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయిన తర్వాత.. జట్టును ఆదుకోవాల్సిన తిలక్ వర్మ, అనవసర షాట్ కు వెళ్లి, క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. మొన్న జరిగిన ఐర్లాండ్ సిరీస్ లో కూడా తిలక్ వర్మ చెత్త ప్రదర్శన కనబరిచాడు. నిన్నటి మ్యాచ్ లో కూడా అతడు విఫలమైన నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నుంచి తిలక్ వర్మ విఫలమౌతూ వస్తున్నాడని మండిపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్. అలాంటి వ్యక్తికి టీమిండియాలో వైస్ కెప్టెన్సీ ఇవ్వడం చాలా తప్పిదం అంటూ ఆగ్రహించారు. బీసీసీఐ నమ్మకం ఉంచి… వైస్ కెప్టెన్సీ ఇస్తే, తిలక్ వర్మ దుర్వినియోగం చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. అతని స్థానంలో రజత్ పాటిదార్ ను తీసుకొని ఉంటే మంచి ఫలితాలు వచ్చేవని సూచనలు చేశారు. ఇంగ్లాండ్ సిరీస్ లో తిలక్ వర్మ విఫలమైతే మాత్రం… అతని పక్కకు పెట్టడం బెటర్ అన్నారు. ఇక నిన్నటి మ్యాచ్లో టీమిండియా ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగిందని ఆగ్రహించారు. 15 ఏళ్ల వైభవ సూర్యవంశీకి అవకాశం ఇస్తే బెటర్ అన్నారు. అతడికి ఈ టోర్నమెంటులో అవకాశం ఇచ్చి… చూస్తే, వాడి ప్రదర్శన బయటపడుతుందని తేల్చి చెప్పారు. సరిగ్గా ఆడకపోతే వైభవ్ ను కూడా పక్కకు పెట్టండని కోరారు.