WBBL 2025: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Womens Big Bash League 2025) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. నవంబర్ 9వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 27 మ్యాచులు పూర్తయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ మెగా టోర్నమెంట్ లో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. అంపైర్లు తీసుకున్న నిర్ణయం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది.. దీంతో రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ చోటు చేసుకుంది. రద్దు కావడంతో ఇరు జట్ల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.
ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Womens Big Bash League 2025 ) భాగంగా ఇవాళ 27వ మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ vs సిడ్నీ థండర్ ఉమెన్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందే వర్షం పడింది. అయితే కాసేపు వర్షం ఆగడంతో మ్యాచ్ ను పున: ప్రారంభించారు. అయితే ఓవర్లను కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. వర్షం పడడంతో ఒక్కో ఇన్నింగ్స్ ను 5 ఓవర్లకు పుదించారు ఫీల్డ్ ఎంపైర్లు. ఈ నేపథ్యంలో మొదట అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 5 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన అడిలైడ్ జట్టు ఏకంగా 45 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో సిడ్నీ థండర్ ఉమెన్ జట్టు దుమ్ములేపింది.
కేవలం 2.5 ఓవర్స్ లోనే వికెట్లు ఏమి నష్టపోకుండా 43 పరుగులు సాధించింది. మరో 13 బంతుల్లో కేవలం మూడు పరుగులు చేస్తే సిడ్నీ జట్టు విజయం సాధిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ vs సిడ్నీ థండర్ ఉమెన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ను వివాదాస్పదంగా రద్దు చేశారు అంపైర్లు. ఇలా మ్యాచ్ ను రద్దు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వర్షం ఎక్కువగా పడకపోయినా కూడా మ్యాచ్ ఆపేసినట్లు సిడ్ని జట్టు తరఫున ప్లేయర్లు అలాగే యాజమాన్యం సీరియస్ అయింది. మరో రెండు బంతులు ఆడిస్తే తమ జట్టు గెలిచేదని సిడ్ని వాదిస్తోంది. కానీ అంపైర్లు అడిలైడ్ కు సపోర్ట్ గా నిలిచారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం వల్ల ఇలా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేశారని ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ అలాగే కొనసాగితే తమ జట్టు విజయం సాధించేదని చెబుతున్నారు.
13 బంతులు ఉండగానే మళ్ళీ వర్షం పడిందని అడిలైడ్ స్ట్రైకర్స్ ఉమెన్ vs సిడ్నీ థండర్ ఉమెన్ మధ్య మ్యాచ్ ను అర్ధాంతరంగా రద్దు చేశారు అంపైర్లు. రూల్స్ ప్రకారం, ఇది చాలా తప్పిదమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. 13 బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, సిడ్నీని విజేతగా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ప్రకటించవచ్చు. కానీ అంపైర్లు అలా చేయకుండా మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేశారు. దీంతో సిడ్నీ జట్టుకు నష్టమే జరిగిందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. దీనిపై ప్రత్యేక విచారణ చేస్తే బాగుంటుందని కూడా సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
#ICYMI: Controversial decision in the Women’s Big Bash League 2025!
The match between Sydney Thunder and Adelaide Strikers ended in chaos after the umpires decided to stop the game when Thunder needed just 3 runs from 13 balls. Thunder were cruising at 43/0 chasing 46 runs, but… pic.twitter.com/jk8KYfRVny
— CricTracker (@Cricketracker) November 28, 2025
No one can believe it! With the @ThunderBBL needing just 3 runs to win, the match was abandoned 🫣 #WBBL11 pic.twitter.com/Azh7FoAcCz
— Weber Women's Big Bash League (@WBBL) November 28, 2025