E-Paper
Advertisement

Shreyas Iyer On Ambani: అంపైర్ల‌ను కొంటారా ? ఫిక్సింగ్ చేస్తారా ? చేయండి, కానీ రాజ‌స్థాన్ ను ఓడించండి !

Shreyas Iyer On Ambani: అంపైర్ల‌ను కొంటారా ? ఫిక్సింగ్ చేస్తారా ? చేయండి, కానీ రాజ‌స్థాన్ ను ఓడించండి !
Advertisement

Shreyas Iyer On Ambani:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (Rajasthan Royals vs Mumbai Indians) మధ్య ప్లే ఆఫ్స్ జట్టును ఫైనల్ చేసే మ్యాచ్ జరగబోతోంది. ముంబైలోని వాంఖడే ( Wankhede Stadium, Mumbai) వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఇవాళ మూడున్నర గంటలకు జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కు చావో రేవో అన్నట్లుగా ఈ మ్యాచ్ మారింది. ఇందులో గెలిస్తేనే రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరనుంది.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

అంపైర్ల‌ను కొంటారా ? ఫిక్సింగ్ చేస్తారా ? చేయండి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals vs Mumbai Indians) మధ్య ఇవాళ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నిన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) కీలక ప్రకటన చేశారు. లక్నో సూప‌ర్ జెయింట్స్‌ పైన 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం ఫుల్ జోష్ లో కనిపించిన శ్రేయస్ అయ్యర్, ముంబై ఇండియ‌న్స్‌ గెలవాలని తాము పూజలు చేస్తున్నట్లు వివరించారు. ఆదివారం మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పైన ముంబై ఇండియన్స్ గెలుస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు శ్రేయస్ అయ్యర్.

ముంబై ఇండియన్స్ చాలా రోజులుగా విఫలమవుతూ వస్తోంది.. కానీ వాళ్ల సొంత మైదానంలో ఆదివారం మ్యాచ్ జరుగుతోందని వెల్లడించారు. ఈ తరుణంలో తమ కోసమైనా రాజస్థాన్ రాయల్స్ జట్టును ముంబై ఇండియన్స్ ఓడిస్తుందని నమ్మకం తమకు ఉందని వ్యాఖ్యానించారు. ఇక అంతా దేవుడిపై భారం వేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతో శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అటు పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ మ‌రో కొత్త అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. అంపైర్ల‌ను కొంటారా ? ఫిక్సింగ్ చేస్తారా ? చేయండి మొత్తానికి రాజ‌స్థాన్ ను ఇంటికి పంపించండి అంటూ నీతా అంబానీని రిక్వెస్ట్ చేస్తున్నారు.

రాజ‌స్థాన్ వ‌ర్సెస్ పంజాబ్…ఎవ‌రు ప్లే ఆఫ్స్ కు చేరే అవ‌కాశం ఉందంటే?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. గుజరాత్, బెంగళూరు, హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరుకోగా నాలుగో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్ అలాగే పంజాబ్ కింగ్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. నిన్న లక్నో పైన గెలిచిన పంజాబ్.. నాలుగో స్థానానికి దూసుకు వచ్చింది. ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ ఉంది. ఇందులో రాజస్థాన్ గెలిస్తే చాలు… ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అటు పంజాబ్ కింగ్స్ ఇంటికి వెళుతుంది. ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే.. పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకోనుంది. బరిలో కేకేఆర్ ఉన్నప్పటికీ.. వాళ్లకు కేవలం 5% ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి రాజస్థాన్ అలాగే పంజాబ్ మధ్య మాత్రమే నాలుగో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. ఇవాళ ఎవరు ఫైనల్ గా నాలుగో స్థానానికి వెళ్తారో చూడాలి.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×