Ind vs SA 2nd ODI: చతిస్గడ్ రాయిపూర్ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లో అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆట ప్రారంభం కాగానే దక్షిణాఫ్రికా బౌలర్ నంద్రే బర్గర్ వేసిన ఓవర్ లో ఏకంగా ఒక్క బంతికే 10 పరుగులు వచ్చాయి. బర్గర్ వేసిన మొదటి ఓవర్ లో యశస్వి జైష్వాల్ తొలి బంతికి పోర్ కొట్టాడు.
Also Read: Ind vs SA 2nd ODI: దక్షిణాఫ్రికాపై కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
ఆ తరువాత బంతిని వైడ్ వేయగా.. ఆ బంతిని వికెట్ కీపర్ ఆపలేకపోవడంతో బౌండరీ వెళ్ళింది. ఆ తర్వాత బంతిని బర్గర్ మళ్ళీ వైడ్ వేశాడు. దీంతో ఒక్క బాల్ కి పది పరుగులు { 4 రన్స్ + 5 వైడ్ రన్స్ + 1 వైడ్} లభించాయి. ఈ యువ పేసర్ బర్గర్ కి ఇది ఓ పీడకల లాంటి ఆరంభం. అయితే ప్రారంభంలోనే ఈ విధమైన భారీ పరుగులు రావడంతో భారత బ్యాటర్లు మరింత ఆత్మ విశ్వాసంతో పరుగులు చేస్తున్నారు.
రెండవ వన్డే లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. తద్వారా భారత్ వన్డేల్లో వరుసగా 20వ సారి టాస్ ఓడింది. ఇక ఈ మ్యాచ్ తో తిరిగి జట్టులో చేరిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా మాట్లాడుతూ.. ” వికెట్ పాతబడే కొద్దీ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. తేమ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మేము మొదట బౌలింగ్ ఎంచుకున్నాం. కానీ పిచ్ స్వభావం ఎలా ఉండబోతుందో ముందుగా చెప్పడం కష్టమే. ఈ మ్యాచ్ లో 3 మార్పులతో బరిలోకి దిగుతున్నాం. ఈ మ్యాచ్ మాకు ఎంతో కీలకం ” అని తెలిపాడు.
20వ సారి టాస్ ఓడిన అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కే ఎల్ రాహుల్ మాట్లాడుతూ.. “సుదీర్ఘకాలంగా మేము టాస్ గెలవలేక పోతున్నాం. ఏది ఏమైనా గత మ్యాచ్ లో మా ప్రదర్శన అద్భుతంగా సాగింది. దక్షిణాఫ్రికా కూడా గట్టి పోటీ ఇచ్చింది. పరుగులు సాధించడంతో పాటు.. వరుస విరామాలలో వికెట్లు తీస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలం. ఈ మ్యాచ్ కి మా తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవు” అని తెలిపాడు.
Read Also: Harshit Rana: గంభీర్ కొడుకు హర్షిత్ రాణా దూల తీర్చిన ఐసీసీ.. ఈ వెధవ పనులు తగ్గించుకో అంటూ
ఇక ఈ రెండవ వన్డే లో రుతురాజ్ గైక్వాడ్ – విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ {22} మరొకసారి నిరాశపరచగా.. రోహిత్ శర్మ కూడా 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. కానీ రుతురాజ్ – కోహ్లీ మాత్రం సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడమే కాకుండా ఇద్దరు సెంచరీలు చేశారు. ప్రస్తుతం 42 ఓవర్ల వద్ద భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ {102}, రుతురాజ్ {105} సెంచరీలు చేశారు.
We’ve seen this before…. iykyk 😉#YashasviJaiswal kicks off the innings with a first-ball boundary… for the 2nd match in a row! 🔥💥#INDvSA 2nd ODI, LIVE NOW 👉 https://t.co/uUUTmm025J pic.twitter.com/V3KyHWfyJz
— Star Sports (@StarSportsIndia) December 3, 2025