E-Paper
Advertisement

NTR: రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. కేంద్రం ఆమోదం..

NTR: రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. కేంద్రం ఆమోదం..

NTR: కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ. జాతిపితకు దేశం ఇచ్చిన గౌరవం ఇది. పలు అరుదైన సందర్భాల్లో.. ప్రత్యేక వ్యక్తుల ఫోటోలతో నాణేలు, స్టాంపులు ముద్రించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఆ అద్భుత గౌరవం తెలుగుతేజం నందమూరి తారకరామారావుకు దక్కింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల వేళ.. కేంద్రం ప్రభుత్వం తెలుగువారికి తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్‌ బొమ్మతో 100 రూపాయల వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిధిలోని మింట్ ఈ నాణేన్ని తీసుకురానుంది.

ఆ వెండి నాణెం ఎలా ఉండాలి? ఎన్టీఆర్ కు చెందిన ఏ ఫోటో పెట్టాలి? తదితర అంశాలపై రామారావు కూతురు పురందేశ్వరితో మింట్ అధికారులు చర్చించారు. ఆమె నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రధానంగా మూడు ఫోటోలను పరిశీలించారు. వాటిలో ఒకటి ఫైనల్ చేయనున్నారు.

ఎన్టీఆర్ పేరిట నాణెన్ని ముద్రించాలని.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను.. బీజేపీ నేత పురందీశ్వరి కోరారు. ఆమె రిక్వెస్ట్ మేరకు.. నిర్మలా సీతారామన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ ఫోటోతో వెండి నాణెం ముద్రించేలా మింట్ నుంచి ఆమోదం వచ్చేలా చూశారు.

వెండి నాణెం తయారీ ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఆ తర్వాతే ఎన్టీఆర్ సిల్వర్ కాయిన్ రిలీజ్ అవుతుందని అంటున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×