E-Paper
Advertisement

Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు

Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు
Advertisement

Sarpancha elections: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. ఈ జిల్లాలో రెండు విడతల్లో జరగనున్న మొత్తం 167 సర్పంచ్‌ స్థానాలకు గాను, తొలిదశలోనే 18 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవాలన్నీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కావడం గమనార్హం.

ఈ సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యన్న ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన సర్పంచ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సర్పంచ్‌లకు ఎమ్మెల్యే సన్మానం చేసి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏకగ్రీవాలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Advertisement

సర్పంచ్‌లను ఉద్దేశించి ఎమ్మెల్యే గండ్ర సత్యన్న కీలక దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి వారు పారదర్శక పాలన అందించాలని కోరారు. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించి.. తమ గ్రామాల్లోని ప్రజల అంచనాలను, ఆశయాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకునేలా సర్పంచ్‌లు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి లోపాలకు తావు ఇవ్వకుండా, అందరినీ కలుపుకుని పోయి సమష్టి కృషితో గ్రామాలను ముందుకు నడిపించాలని ఆయన చెప్పుకొచ్చారు.

ALSO READ: Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాజధాని కాదు.. ప్రధానమైన ఆర్థిక నగరం, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×