E-Paper
Advertisement

Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు

Sarpancha elections: జయశంకర్ జిల్లాలో 18 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం.. ఎమ్మెల్యే గండ్ర అభినందనలు

Sarpancha elections: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. ఈ జిల్లాలో రెండు విడతల్లో జరగనున్న మొత్తం 167 సర్పంచ్‌ స్థానాలకు గాను, తొలిదశలోనే 18 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవాలన్నీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు కావడం గమనార్హం.

ఈ సందర్భంగా, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యన్న ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన సర్పంచ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సర్పంచ్‌లకు ఎమ్మెల్యే సన్మానం చేసి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏకగ్రీవాలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.

సర్పంచ్‌లను ఉద్దేశించి ఎమ్మెల్యే గండ్ర సత్యన్న కీలక దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి వారు పారదర్శక పాలన అందించాలని కోరారు. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించి.. తమ గ్రామాల్లోని ప్రజల అంచనాలను, ఆశయాలను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకునేలా సర్పంచ్‌లు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి లోపాలకు తావు ఇవ్వకుండా, అందరినీ కలుపుకుని పోయి సమష్టి కృషితో గ్రామాలను ముందుకు నడిపించాలని ఆయన చెప్పుకొచ్చారు.

ALSO READ: Kishan Reddy: హైదరాబాద్‌ కేవలం రాజధాని కాదు.. ప్రధానమైన ఆర్థిక నగరం, కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×