ACB Raids: వరుస దాడుతో ఏసీబీ అధికారులు హడలెత్తిస్తున్నారు. దుండిగల్ GHMC సర్కిల్ కార్యాలయంలో ACB దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్య అధికారి అయిన కమిషనర్ వెంకటేశ్వర్లు ఛాంబర్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్దమొత్తంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయాని అధికారులు తెలిపారు. కార్యాలయంలోకి ఎవరిని రానియ్యకుండా పలుకీలక మైన ఫైల్లను తనికీ చేస్తేున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
కుత్భుల్లాపూర్ మున్సిపల్ జోనల్ ఆఫీస్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్టుగా అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు నిన్న దాడులు జరిపారు. విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. వేర్వేరు పనుల మీద కార్యాలయానికి వచ్చే ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి సిబ్బందిలో కొందరు భారీ ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే కార్యాలయంపై దాడి జరిపిన ఏసీబీ అధికారుల బృందం భవన నిర్మాణ అనుమతులు, అక్రమాల కట్టడాలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు.
Also Read: YouTube: యూట్యూబ్ సేవలకు అంతరాయం.. పరిశీలిస్తున్నామన్న నిర్వాహకులు, టెన్షన్ పడిన యూజర్లు
పన్ను వసూళ్లు, మ్యూటేషన్లతోపాటు రెవెన్యూ సంబంధిత ఫైళ్లను తనిఖీ చేశారు. జరిగిన అభివృద్ధిపనులకు సంబంధించి కాంట్రాటర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో సిబ్బంది ఎవరైనా చేతివాటాన్ని ప్రదర్శించారా? అన్న కోణంలో విచారణ జరిపారు. తనిఖీలు జరిగినంత సేపు ఆఫీస్ లోపలికి ఎవ్వరినీ అనుమతించ లేదు. కాగా, సోదాల్లో పలు కీలక ఫైళ్లను ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్టుగా తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
దుండిగల్ GHMC సర్కిల్ కార్యాలయంలో ACB దాడులు
కమిషనర్ వెంకటేశ్వర్లు ఛాంబర్ లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు
ACB Raids at Dundigal GHMC circle office pic.twitter.com/iL2X90DDQP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2026