BigTV English
Advertisement

KTR: కేటీఆర్ చెప్పిందే జరిగింది.. ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ సోదాలు ప్రారంభం..

KTR: కేటీఆర్ చెప్పిందే జరిగింది.. ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ సోదాలు ప్రారంభం..

KTR: మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిందే జరిగింది. తన నివాసంలో ఏసీబీ సోదాలు జరుగుతాయని, సోమవారం ఏసీబీ విచారణకు వచ్చిన సందర్భంగా కేటీఆర్ చెప్పారు. అదే రీతిలో గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించడం విశేషం. అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తారని ముందే కేటీఆర్ కు సమాచారం ఎలా చేరిందన్నది తెలియాల్సి ఉంది.


ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరి ఆరవ తేదీన విచారణకు రావాలని కేటీఆర్ కు గతంలో ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తనపై కేసు నమోదు కాగా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును, ప్రస్తుతం రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏసీబీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని హైకోర్టు తెలిపింది.

ఈ మేరకు సోమవారం ఏసీబీ కార్యాలయం వద్దకు విచారణకు వచ్చిన కేటీఆర్, తనతోపాటు న్యాయవాదులను కూడా అనుమతించాలని ఏసీబీ అధికారులను కోరారు. న్యాయవాదులను అనుమతించకపోవడంతో కేటీఆర్ అక్కడి నుండి వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే ఏసీబీ కార్యాలయం వద్ద కారులో నుండే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు తన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. సోదాల పేరుతో తన ఇంటిలో పలు పత్రాలను ఉంచి తనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుందని కేటీఆర్ అన్నారు.


Also Read: Congress: కేటీఆర్.. మరీ అంత భయమా? కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మేల్యే సెటైర్లు

కేటీఆర్ చెప్పినట్లుగానే ఏసీబీ అధికారులు గచ్చిబౌలి ఓరియన్ విల్లాస్ లో సోమవారం సాయంత్రం సోదాలు ప్రారంభించారు. తమ విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నప్పటికీ, రహస్యంగా ఉండాల్సిన సోదాల విషయం కేటీఆర్ కు ఎలా తెలిసిందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విల్లాస్ వద్దకు చేరుకున్నారు.

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×