E-Paper
Advertisement

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్
Advertisement

Bandi Sanjay Reaction On Animal fat being used in Tirupati Laddu: తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందంటూ ఆయన సీరియస్ అయిన విషయం తెలిసిందే.

చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటి నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అటు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చి దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలిసి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. దీనిపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

సోషల్ మీడియా (ఎక్స్)లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విధంగా పోస్ట్ పెట్టారు. ‘లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడి తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులు, హిందూ భక్తుల పట్ల నమ్మకాన్ని వమ్మూ చేశారు. ఇది కావాలనే హిందూ భక్తులకు పెద్ద మోసం చేశారు. ఈ విషయంలో బాధ్యులను దేవుడు అస్సలు క్షమించడు.

Advertisement

టీటీడీ బోర్డులో ఇతర మతస్థులు, ఉద్యోగులు ఉంటే ఇటువంటి పరిస్థితులకే దారి తీస్తుందని గతంలో కూడా మేం ఆందోళన వ్యక్తం చేశాం. అయినా పట్టించుకోలేదు.

Also Read: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యతను కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. అదేవిధంగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడకం విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ కేంద్ర మంత్రి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×