E-Paper
Advertisement

Babumohan, Manda out: కలిసిరాని కాలం, నామినేషన్ల తిరస్కరణ

Babumohan, Manda out: కలిసిరాని కాలం, నామినేషన్ల తిరస్కరణ

Babumohan, Manda out: పైన కనిపిస్తున్న ఇద్దరు నేతలు రాజకీయాల్లో సీనియర్లు. ఒకరు మాజీమంత్రి బాబుమోహన్, మరొకరు మాజీ ఎంపీ మందా జగన్నాథం. ఒకప్పుడు రాజకీయాల్లో ఈ నేతలకు తిరుగులేదు. ప్రస్తుతం పార్టీలు మారినా కాలం మాత్రం వీరిద్దరికీ కలిసి రాలేదు.

తెలంగాణ పార్లమెంటు బరిలోకి దిగారు బాబుమోహన్, మందా జగన్నాథం. శుక్రవారంతో తెలంగాణలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మొత్తం 17 సీట్లకు 893 మంది నామినేషన్లు వేశారు. అందులో 267 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అందులో మాజీ ఎంపీ మందా జగన్నాథం, మాజీ మంత్రి బాబుమోహన్‌లకు అధికారులు షాకిచ్చారు. రీసెంట్‌గా ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.   ఈక్రమంలో ఆయన వరంగల్ ఎంపీ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. అయితే బాబుమోహన్‌ నామినేషన్‌లో ప్రతిపాదించిన వ్యక్తుల సంతకాలు లేకపోవడంతో తిరస్కరించారు ఎన్నికల అధికారులు.

మాజీ ఎంపీ మందా జగన్నాథం విషయానికొద్దాం. మూడుసార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. రెండుసార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్ తరుపున విజయం సాధించారు. తెలంగాణలో మారిన రాజకీయాల నేపథ్యంలో కారు పార్టీలోకి వెళ్లారు. అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. పార్టీ తరపున బీఫామ్ ఇవ్వకపోవడంతో నామినేషన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.

 

Tags

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×