Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ వాలెంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ మూడు పార్టీల మధ్య ఉన్నది పవిత్ర బంధం కాదు.. ‘అక్రమ సంబంధం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పార్టీలు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతూనే.. వారి మధ్య ఉన్న బంధాన్ని ప్రజల ముందు ఉంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ బంధాన్ని ‘ఫెవికాల్ బంధం’ అని అభివర్ణించారని గుర్తు చేస్తూ.. ఇది ప్రజలను మోసం చేసే ‘ఎంజీ ’ బంధమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని.. కానీ కరీంనగర్ ప్రజలు , బీజేపీ కార్యకర్తల ఐక్యత ముందు ఈ తప్పుడు ఎత్తుగడలు సాగవని హెచ్చరించారు.
‘వీరి ప్రేమ, వీరి అక్రమ బంధం ప్రజల చిత్కారాలతో, ఛీత్కారాలతో నిండు నూరేళ్లు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని బండి సంజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు వీరి నాటకాలను గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీని రాజకీయంగా దెబ్బతీయడానికి సిద్ధాంతాలు పక్కన పెట్టి మరీ ఈ పార్టీలు కలిశాయని.. కరీంనగర్ వేదికగా వారి అక్రమ సంబంధం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి.. ప్రేమ దినోత్సవం రోజున రాజకీయ ప్రత్యర్థులపై బండి సంజయ్ చేసిన ఈ ‘ఘాటు’ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Also Read: ’ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది‘..కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
వాలెంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు శుభాకాంక్షలు. ఈ రెండు పార్టీల అక్రమ బంధం నిండు నూరేళ్లు ప్రజల చీవాట్లతో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా – కేంద్ర మంత్రి బండి సంజయ్
"On the occasion of Valentine's Day, best wishes to the Congress and BRS parties. I wish… pic.twitter.com/4uY1x5s1uK
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2026