E-Paper
Advertisement

Bandla Ganesh : హరీష్‌రావు, కేటీఆర్‌కు ఈర్ష్య పీక్ స్టేజ్ చేరింది.. బండ్ల గణేష్ ఘాటుగా సెటైర్లు..

Bandla Ganesh : హరీష్‌రావు, కేటీఆర్‌కు ఈర్ష్య పీక్ స్టేజ్ చేరింది.. బండ్ల గణేష్ ఘాటుగా సెటైర్లు..
Advertisement

Bandla Ganesh : సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజుల పూర్తైన నేపథ్యంలో పాలనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా పాలన జరుగుతోందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు ప్రజాపథం వైపునకు దూసుకుపోతున్నారని కితాబిచ్చారు.

బీఆర్ఎస్ నేతలపై బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రులు హరీష్ రావు, కేటీఆర్ కు ఈర్ష్య పీక్ స్టేజ్ కు చేరుకుందని విమర్శించారు. 100 రోజుల తర్వాత పప్పులు ఉడకడం కాదు బిర్యానీ కూడా ఉడుకుతుందని.. హరీష్ రావు అంటూ సెటైర్ వేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారని అంటూ నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలపై కేంద్రంతో కొట్లాడారా? అంటూ ప్రశ్నించారు.

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాటం చేస్తున్నారని బండ్ల గణేష్ అన్నారు. పాలనలో పారదర్శకత కోసం అవినీతి అధికారులను పక్కకు తప్పిస్తున్నారని తెలిపారు. నిజాయితీ అధికారులకు కీలక బాధ్యతలను అప్పగించి పరిపాలన చేస్తున్నారంటూ సీఎం రేవంత్ ను ప్రశంసించారు. పార్లమెంటు ఎన్నికలపై బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదని స్పష్టం చేశారు.

గతంలో రాష్ట్రపతి వస్తే స్వాగతం పలకడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదని బండ్ల గణేష్ గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి వచ్చినా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉందని స్పష్టంచేశారు. ఏ సమస్య ఉన్నా సామాన్యులు సచివాలయానికి వెళ్తున్నారని తెలిపారు. ప్రగతి భవన్ ను దళితుడైన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఇచ్చారన్నారు. తెలంగాణలో ఇన్ని మార్పులు జరుగుతుంటే హరీష్ రావు , కేటీఆర్ ఎందుకు ఇంతగా ఆగం అవుతున్నారని బండ్ల గణేష్ మండిపడ్డారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×