TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ రూట్లో నడిచే బస్సుల టికెట్ ధరలపై 16 శాతం నుంచి 30 శాతం వరకు భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. ఈ ఆఫర్ ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్లకు వర్తిస్తుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు బస్సు సేవల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో ముందుకెళ్తోంది.
డిస్కౌంట్ వివరాలు..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల కోసం తీసుకున్న నిర్ణయం మేరకు డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.
గరుడ ప్లస్ బస్సులు: ఈ బస్సుల్లో టికెట్ ధరలపై అత్యధికంగా 30 శాతం రాయితీ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా.. టికెట్ ధర రూ.1000 ఉంటే రాయితీ ద్వారా ఇప్పుడు రూ.700 కే లభిస్తోంది. (రూ.635 ధర ఉన్న టికెట్ ఇప్పుడు రూ.444కి లభిస్తుంది.)
ఈ- గరుడ బస్సులు: ఈ సర్వీసుల్లో బస్సుల్లో టికెట్ ధరలపై 26% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎగ్జాంపుల్ గా టికెట్ ధర రూ.592 టికెట్ ధర రూ.438 కే లభించనుంది.
సూపర్ లగ్జరీ అండ్ లహరి నాన్-ఎసీ బస్సులు: ఈ బస్సుల్లో టికెట్ ధరలపై 20% రాయితీ కల్పించనున్నారు. ఉదాహరణకు, రూ.815 ధర ఉన్న సూపర్ లగ్జరీ టికెట్ రూ.685కి అందుబాటులో ఉంటుంది.
రాజధాని అండ్ లహరి ఏసీ బస్సులు: ఈ సర్వీసుల్లో 16% తగ్గింపు ఉంటుంది. రూ.533 టికెట్ ధర ఉన్న రాజధాని టికెట్ ఇప్పుడు రూ.448కి లభించనుంది.
లహరి ఎసీ స్లీపర్ బస్సులు: ఈ సర్వీసుల్లో టికెట్ ధర రూ.1,569 నుంచి రూ.1,177కి అందుబాటులోకి రానుంది. సీటర్-కమ్-బెర్త్ ధర రూ.1,203 నుంచి రూ.903కి తగ్గించబడింది.
ఈ రాయితీలు ఆన్లైన్ బుకింగ్లతో పాటు ఆఫ్లైన్ బుకింగ్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు TGSRTC అధికారిక వెబ్సైట్ (https://www.tgsrtcbus.in/) ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ను TGSRTC ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ డిస్కౌంట్తో ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా, ఎక్కువ మంది ఆర్టీసీ సేవలను ఉపయోగించే అవకాశం ఉంది.
ALSO READ: Cheetah Video Viral: గోల్కొండలో చిరుత సంచారం… సోషల్ మీడియాలో వీడియో వైరల్
ALSO READ: Amit Shah: మీరు మరో 20 ఏళ్లు అక్కడే ఉంటారు.. లోక్సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం