BigTV English
Advertisement

Amit Shah: మీరు మరో 20 ఏళ్లు అక్కడే ఉంటారు.. లోక్‌సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం

Amit Shah: మీరు మరో 20 ఏళ్లు అక్కడే ఉంటారు.. లోక్‌సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం

Amit Shah: లోక్‌సభలో ఇవాళ ఆపరేషన్ సిందూర్ చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు.


అయితే.. ఈ రోజు లోక్ సభలో ఆపరేషన్ సిందూర్ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఆ తర్వాత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆపరేషన్ సిందూర్ వివరాలను గురించి చెప్పారు. జైశంకర్ మాట్లాడుతుండగా.. ప్రతిపక్ష నాయకుల కొంత గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘మీ సొంత విదేశాంగ మంత్రికి మీరు గౌరవం ఇవ్వరా..?’ అని ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం భారతీయ విదేశాంగ మంత్రిపై నమ్మకం లేకపోవడం.. ఇతర దేశాలపై నమ్మకం ఉంచడం దారుణమని మండిపడ్డారు. మీ ప్రవర్తనే.. మిమ్మిల్ని ప్రతిపక్ష బెంచీలపై కూర్చోబెట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. మీరు మరో 20 ఏళ్ల పాటు ఇదే ప్రతిపక్షంలో ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: Viral Video: ఈ పాము ఆస్కార్ పర్ఫార్మెన్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే బ్రో..


కేంద్ర మంత్రి జైశంకర్ తన ప్రసంగంలో భారత్‌ దౌత్యపరమైన విజయాల గురించి చెప్పారు. పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించడం భారత దౌత్య విజయమని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌లోని బహవల్పూర్, మురిద్కేలలోని ఉగ్రవాద కేంద్రాలు కూల్చివేశామని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భారత్‌ అంతర్జాతీయ దౌత్య ప్రభావాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా, క్వాడ్, బ్రిక్స్ వంటి సమూహాలు, అనేక దేశాలు పహల్గామ్ దాడిని ఖండించాయని, ఇది అంతర్జాతీయ సమాజంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు మద్దతును సూచిస్తుందని జైశంకర్ వివరించారు.

ALSO READ: Suleiman Shah: పహల్గామ్ మాస్టర్ మైండ్, డేంజర్ టెర్రరిస్ట్ సులేమాన్ షా హతం..

జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు భారత్‌కు మద్దతు తెలిపాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు స్వయం రక్షణ హక్కు ఉందని జర్మన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నట్లు జైశంకర్ సభలో వ్యాఖ్యానించారు. ఈ చర్చ భారత్‌ బలమైన అంతర్జాతీయ స్థితిని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో దాని నిరంతర ప్రయత్నాలను స్పష్టం చేసింది.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×