E-Paper
Advertisement

Bomb Threat: హై అలర్ట్! శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు కలకలం.. గల్ఫ్ ఎయిర్ విమానానికి బెదిరింపు

Bomb Threat: హై అలర్ట్! శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బాంబు కలకలం.. గల్ఫ్ ఎయిర్ విమానానికి బెదిరింపు
Advertisement

Bomb Threat: బహ్రెయిన్ నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన గల్ఫ్ ఎయిర్ లైన్స్ (GF-274) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. విమానం గాలిలో ఉండగానే అధికారులకు అందిన ఒక ఈమెయిల్, ప్రయాణికులను, విమానాశ్రయ సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అప్రమత్తమైన పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా రన్ వే పై ల్యాండ్ చేశారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే, భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం విమానాన్ని రన్ వే కు దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకి తరలించారు. విమానంలోని ప్రయాణికులందరినీ అత్యవసరంగా కిందకు దించి, వారిని సురక్షిత ప్రాంతానికి చేరవేశారు. విమానాశ్రయ భద్రతా బలగాలు (CISF), బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ప్రయాణికుల లగేజీని కూడా స్కానింగ్ యంత్రాల ద్వారా నిశితంగా పరిశీలించారు.

Advertisement

సుదీర్ఘ తనిఖీల అనంతరం, విమానంలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఒక ‘హోక్స్’ కాల్ అని తేలింది. ఈ తనిఖీల కారణంగా విమానాశ్రయంలో కొంత సమయం పాటు ఇతర సర్వీసులకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ లైన్స్ యజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

Also Read: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా.. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడి!

Advertisement

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో సైబర్ క్రైమ్ విభాగం విచారణ జరుపుతోంది. విమాన ప్రయాణికుల భద్రతతో ఆటలాడుకునే ఇటువంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×