Teenmar Mallanna: రెడ్లను కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల రెడ్డి సంఘం నాయకులు గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యూ న్యూస్ వేదికగా సెప్టెంబర్ ఐదున నకిరేకల్లో సీఎం సభ నిర్వహించినవిషయం మనందరికి తెలిసిన విషయమే..
అయితే ఈ సందర్భంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి మీడియాతో చెప్పిన వ్యాఖ్యలను ఊటంకిస్తూ చింతపండు నవీన్ రెడ్లకు నీతి జాతి లేదు అంటూ అసభ్యకరంగా, అవమానకరంగా రెడ్లను దూషించడం జరిగిందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు పెరిగి ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసి శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా కుట్రపూరితంగా ఉన్నాయన్నారు.
Also read: Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్డేట్స్ రావు!
ఇలాంటి వ్యాఖ్యాల వల్ల పెట్టుబడులపై ప్రభావం చూపి తెలంగాణ ప్రజల అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలుగుతుందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో చింత పండు నవీన్ పై కేసునమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గద్వాల రెడ్డి సంఘం నాయకులు కోరారు.
Also read: భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!