Olympiad Success: స్వేచ్ఛ బ్యూరో: యూనిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అంతర్జాతీయ ఒలింపియాడ్ పరీక్షల్లో బోటనీ బాలాజీ స్కూల్ విద్యార్థుఆలు ప్రతిభాపాటవాలను చాటుతూ అద్భుత విజయాలు సాధించారు. అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్ (ఐఎంఓ) లో 23 బంగారు పతకాలు, అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్ (ఎన్ఎస్ఓ)లో 20 బంగారు పతకాలు, అంతర్జాతీయ ఇంగ్లీష్ ఒలింపియాడ్ (ఐ ఈ ఓ)లో 10 బంగారు పతకాలు సాధించి మొత్తం 53 బంగారు పతకాలతో విశేష ప్రతిభ కనబరిచారు. అదనంగా, 276 జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ర్యాంకులను సొంతం చేసుకుని విద్యార్థులు అగ్రగామిగా నిలిచారు.
Also read: కన్నీళ్లు పెట్టుకున్న హేమా.. డ్రగ్స్ వ్యవహారంపై ఓపెన్ ఛాలెంజ్.. ‘బిగ్ టీవీ’తో ఏం చెప్పారంటే?
ప్రత్యేకంగా విద్యార్థి టీ. ఉదయ్ రాఘవకు నగదు బహుమతి లభించడం విశేషం. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి జగపతి చేతుల మీదుగా విజేతలకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పాఠశాల ప్రతినిధి నర్సన్ మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన విద్యా విధానం, క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బాలాజీ, ప్రిన్సిపల్ అనంతరావు, కోఆర్డినేటర్లు సుధాకర్, నాజియా సుల్తానా, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
Also Read: ‘సెకండ్ హ్యాండ్’ స్క్రిప్ట్తోనే సరిపెట్టుకుంటున్న రౌడీ స్టార్?