MLA KP Vivekananda: స్వేచ్ఛ, బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్న అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ (MLA KP Vivekananda) కేపీ వివేకానంద గౌడ్ దుయ్యబట్టారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ లో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖం చూపెట్టుకోలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలు విశ్వాసం కోల్పోయారన్నారు. 99 రోజులు ప్రజాపాలన 9 రోజులుకే బొక్క బోర్ల పడిందని ఎద్దేవా చేశారు. 99 రోజులు పాలనకు నిధులు లేవు.. విధులు లేవు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కాలం అయిందని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడానికి సీఎం వెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పై విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: LPG Supply: ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన చంద్రబాబు
ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ మాట్లాడుతూ రైతు కు ప్రకృతి వైపరీత్యాలే సమస్య అనుకుంటే ఇపుడు ప్రభుత్వ వైపరీత్యాలు కూడా తోడయ్యాయని మండిపడ్డారు. యాసంగి కి రైతు భరోసా ఇవ్వలేదన్నారు. మొక్క జొన్న కొనుగోలు కు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు లేవు అని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రావాల్సిన ధరలో 35 శాతం నష్టపోతున్నారని మండిపడ్డారు. కరెంటు లేదు, పెట్టుబడి లేదని రైతు చాలా నష్టపోతున్నారన్నారు. ప్రెజెంట్ ని నాశనం పట్టించి ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయశాఖ మంత్రి కళ్ళు తెరవాలని సూచించారు.