BigTV English

BRS Power Scam | ఒక్క విద్యుత్‌ శాఖలోనే రూ.81516 కోట్ల అవినీతి.. ఇదీ బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత!

BRS Power Scam | మాజీ సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. గులాబీ నేతల అవినీతి బాగోతాన్ని బయటపెడతానన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ఆ దిశగా ఫోకస్‌ పెట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారించిన కాంగ్రెస్‌.. గులాబీ నేతలు ఏ సంస్థలో ఎంత దోచుకున్నారన్న దానిపై దృష్టిపెట్టింది. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ గురించి గొప్పగా చెప్పిన విద్యుత్‌ శాఖపై ఆరా తీస్తోంది.

BRS Power Scam | ఒక్క విద్యుత్‌ శాఖలోనే రూ.81516 కోట్ల అవినీతి.. ఇదీ బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత!

BRS Power Scam | మాజీ సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. గులాబీ నేతల అవినీతి బాగోతాన్ని బయటపెడతానన్న ముఖ్యమంత్రి రేవంత్‌ ఆ దిశగా ఫోకస్‌ పెట్టారు. అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దృష్టి సారించిన కాంగ్రెస్‌.. గులాబీ నేతలు ఏ సంస్థలో ఎంత దోచుకున్నారన్న దానిపై దృష్టిపెట్టింది. కేసీఆర్‌ 24 గంటల కరెంట్‌ గురించి గొప్పగా చెప్పిన విద్యుత్‌ శాఖపై ఆరా తీస్తోంది.


సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిందే చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ పాలను టార్గెట్‌ చేసిన రేవంత్‌… ఆ దిశగా పావులు కదుపుతున్నారు. కేసీఆర్‌ గొప్పలు చెప్పుకున్న ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. అదే పనుల్లో ఏ మేర అవినీతికి పాల్పడ్డారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ సంస్థల స్థితిగతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లెక్కలపై కూపీ లాగుతున్నారు. ఈ అధ్యయనంలో ఒక్క విద్యుత్‌ శాఖలోనే 80 వేలకుపైగా అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు.

విద్యుత్‌ సంస్థలు 81 వేల 516 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిందని.. డిస్కమ్‌లు 50 వేల 275 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు గుర్తించింది. ఇటీవల సీఎం రేవంత్‌ విద్యుత్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అలాగే కరెంట్‌ ఛార్జీల రూపంలో 28 వేల కోట్ల దాకా డిస్కమ్‌లకు ప్రభుత్వం బకాయిలు ఉండటమే కాకుండా… ట్రూఅప్‌ ఛార్జీల కింద చెల్లిస్తామని చెప్పిన 12 వేల 515 కోట్లు చెల్లించలేదని అధికారులు తెలిపారు . మరోవైపు కేసీఆర్ పాలనలో అవసరం లేకపోయినా 30 వేల కోట్లను వెచ్చించి విద్యుత్‌ను కొనుగోలు చేసిందని.. ఈ కొనుగోళ్లతో బీఆర్‌ఎస్‌ నేతలు కొందరి లబ్ది చేకూరిందని గుర్తించిట్టు తెలుస్తోంది. దీంతో విద్యుత్‌ సంస్థలో లెక్కలను దాచిన అధికారులపై ప్రస్తుత సర్కార్ చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం.


Related News

Palakurthi Politics: ఎర్రబెల్లి యూ టర్న్.. యశస్విని రెడ్డికి షాక్ తప్పదా?

Kadapa MLA: కడప రెడ్డమ్మ కథ రివర్స్..?

BJP Vs BRS: కేసీఆర్‌కు బీజేపీ షాక్! వెనుక స్కెచ్ ఇదే!

Urea War: బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలింపు.? కేంద్రం చెప్పిందెంత..? ఇచ్చిందెంత..?

AP Politics: సామినేని అంతర్మథనం..

Satyavedu Politics: మారిన ఆదిమూలం స్వరం.. భయమా? మార్పా?

Big Stories

×