E-Paper
Advertisement

Nominations in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్లు.. నిన్న ఎవరెవరు వేశారంటే..?

Nominations in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్లు.. నిన్న ఎవరెవరు వేశారంటే..?

Candidates Nominations in Telugu States for Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 18) నుంచి నామినేషన్ల ప్రకియ ప్రారంభం కాగా.. నిన్న పలువురు కీలక నేతలు తాము పోటీ చేసే స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో నిన్న నామినేషన్లు వేసిన స్థానాల్లో మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌, సికింద్రాబాద్‌ స్థానాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రెండు నామినేషన్ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయి ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.

balakrishna nomination
balakrishna nomination

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అంబర్ పేట మహంకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సాయిబాబా దర్శనం.. ఆ తరువాత నల్లకుంటలోని శంకర్ మఠ్‌లో స్వామివారిని దర్శించుకుని నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

Also Read: YS Sharmila nomination: నామినేషన్ దాఖలు, మాటలకు సంకెళ్లా?

ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్న నామినేషన్లు వేసిన స్థానాల్లో.. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో TDP అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి TDP అభ్యర్థిగా ఎన్డీయే కూటమి నుంచి నందమూరి బాలకృష్ణ నామినేషన్‌ వేశారు. మూడోసారి హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ సూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ YCP అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు బొత్స సత్యనారాయణ. చీపురుపల్లిలో భారీ ర్యాలీ అనంతరం నామినేషన్ దాఖలు చేశారు బొత్స. ఉండి నియోజకవర్గం నుంచి TDP లేదా జనసేన టికెట్ ఆశించిన రఘురామ కృష్ణరాజు మరో ట్విస్ట్ ఇచ్చారు. అక్కడి నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా తన కుమారుడు కనుమూరి భరత్‌ను బరిలోకి దించారు. ఉండి ఆర్వో కార్యాలయానికి కుమారుడు భరత్‌తో పాటు రఘురామ కృష్ణరాజు వెళ్లి నామినేషన్ వేయించారు. రఘురామ తరఫున ఆయన భార్య నామినేషన్ వేశారు.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×