CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులకు అభినందనలు తెలిపారు. ప్రజలు కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు పూర్తయి 12వ ఏటలోకి అడుగుపెడుతోంది.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్ధికాభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతినబూనారు.అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనతో అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు.
ALSO READ: జూన్ ఐదున కేబినెట్ భేటీ, రాజీవ్ యువ వికాసం స్కీమ్పై చర్చ
తక్కువ సమయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల జీవనవిధానం మెరుగయ్యేలా పాలనను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అటు శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మిగతా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు,సంపదలు…
— Narendra Modi (@narendramodi) June 2, 2025
#TelanganaFormationDay
తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో…— N Chandrababu Naidu (@ncbn) June 2, 2025
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2025