E-Paper
Advertisement

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం..ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
Advertisement

CM Revanthreddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఏళ్లకేళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులకు అభినందనలు తెలిపారు. ప్రజలు కలిసి కట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏర్పడి పదకొండేళ్ళు పూర్తయి 12వ ఏటలోకి అడుగుపెడుతోంది.

Advertisement

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్ధికాభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి ప్రతినబూనారు.అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనతో అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు.

Advertisement

ALSO READ: జూన్ ఐదున కేబినెట్ భేటీ, రాజీవ్ యువ వికాసం స్కీమ్‌పై చర్చ

తక్కువ సమయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. అదే స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల జీవనవిధానం మెరుగయ్యేలా పాలనను అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అటు శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, మిగతా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

 

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×