TIMS Hospital: సనత్ నగర్లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమారనికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిదులు కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గోన్నారు. ఆసుపత్రిలో ఉన్నవివిధ ముఖ్య అధికారులందరూ సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు.
Also Read: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ.. ఏ పార్టీలో అంటే?
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంత్రి దామోదరతో సీఎం రేవంత్ రిబ్బన్ కట్ చేయించారు. దాదాపుగా రూ.1,126 కోట్లతో సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేసారు. ఈ ఆసుపత్రి ద్వారా రోజుకు కనీసం సుమారు 300 మందికి పైగా ఓపీ సేవలు అందించనున్నారు. టిమ్స్లో 1,082 బెడ్లు, 300 ఐసీయూలు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లును ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వ రంగంలో ఏఐ న్యూమాటిక్ ట్యూట్ సిస్టమ్ కలిగిన ఏకైక ఆసుపత్రిగా పేరుపొందింది.