Hyderabad City: మూసీ సుందరీకరణపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ క్రేన్ ఎక్కి పైనుంచి మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.
హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఉదయం స్వయంగా పరిశీలించారు. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మిస్తోంది. దాని పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భవిష్యత్లో అందుబాటులోకి రానున్న మౌలిక వసతులపై చర్చించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పేశారు. నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువు పరిసరాల అభివృద్ధి ద్వారా నగర ప్రజలకు పబ్లిక్ స్పేస్లు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
మీరాలం చెరువును ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్మాణాలను చేపడుతోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. చెరువు పరిసర ప్రాంతానికి ఆకర్షణ పెరగడంతోపాటు సందర్శకుల తాకిడి పెరిగే అవకాశముంది. చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్, మీరాలం నుంచి మూసీలోకి వరద వెళ్లేలా నాలాను విస్తరించాలన్నారు.
చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్లు రూపొందించి, మధ్యలో ఐల్యాండ్ను డెవలప్ చేయాలన్నారు. ఉన్నట్లుండి సీఎం రేవంత్రెడ్డి ఆకస్మిక పర్యటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇకపై సీఎం ఎప్పుడు సడన్ గా పర్యటనకు వస్తారేమోనని అంటున్నారు. ఇకపై పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చర్చించుకుంటున్నారు.
ALSO READ: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!
మీరాలం చెరువును ఆకస్మికంగా సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి
సీఎం రేవంత్రెడ్డి మీరాలం చెరువును ఆకస్మికంగా సందర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి అభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.… pic.twitter.com/VRl2hXe7ZQ
— BIG TV Breaking News (@bigtvtelugu) August 27, 2026