E-Paper
Advertisement

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు

మీరాలం చెరువు పనులపై సీఎం రేవంత్ ఆకస్మిత తనిఖీలు, అధికారులు పరుగో పరుగు
Advertisement

Hyderabad City: మూసీ సుందరీకరణపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ క్రేన్ ఎక్కి పైనుంచి మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు చేశారు.

 

మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ ఫోకస్

Advertisement

హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా మీరాలం చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఉదయం స్వయంగా పరిశీలించారు. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మిస్తోంది. దాని పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్న మౌలిక వసతులపై చర్చించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పేశారు. నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెరువు పరిసరాల అభివృద్ధి ద్వారా నగర ప్రజలకు పబ్లిక్ స్పేస్‌లు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Advertisement

 

మీరాలం చెరువు పనులపై సీఎం ఆకస్మిత తనిఖీలు

మీరాలం చెరువును ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్మాణాలను చేపడుతోంది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. చెరువు పరిసర ప్రాంతానికి ఆకర్షణ పెరగడంతోపాటు సందర్శకుల తాకిడి పెరిగే అవకాశముంది. చెరువులోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్, మీరాలం నుంచి మూసీలోకి వరద వెళ్లేలా నాలాను విస్తరించాలన్నారు.

చెరువులో వాటర్ స్పోర్ట్స్‌ కోసం డిజైన్లు రూపొందించి, మధ్యలో ఐల్యాండ్‌ను డెవలప్ చేయాలన్నారు. ఉన్నట్లుండి సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక పర్యటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇకపై సీఎం ఎప్పుడు సడన్ గా పర్యటనకు వస్తారేమోనని అంటున్నారు. ఇకపై పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు చర్చించుకుంటున్నారు.

ALSO READ: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

 

Related News

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

ట్యాంక్​ బండ్‌లో దూకిన సూడాన్ దేశస్తుడు.. కానీ చివరికి..?

కూతురు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య!

ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!

దేశానికే ఆదర్శంగా తెలంగాణ మహిళా సంఘాలు.. ఢిల్లీ వేదికగా జాతీయ అవార్డు!

కేఆర్ఎంబీ అంటే లెక్క లేదు.. త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు.. ఏపీపై హరీశ్ రావు ఫైర్

గట్టు గ్రామపంచాయతీలో భారీ కుంభకోణం.. రూ. 22 లక్షల ప్రజాధనం మాయం!

Big Stories

Advertisement
×