E-Paper
Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ ఫోటోతో పతంగులు.. అభిమానం చాటుకున్న మెట్టు సాయికుమార్

CM Revanth Reddy: సీఎం రేవంత్ ఫోటోతో పతంగులు.. అభిమానం చాటుకున్న మెట్టు సాయికుమార్
Advertisement

CM Revanth Reddy: సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది గాలిపటాలు. సంక్రాంతి వేడుకల్లో చిన్నా, పెద్దా అని తేడా లేకుండా.. అంతా పతంగుల ఎగరవేతలో ఉత్సాహంగా పోటీ పడుతుంటారు. పండుగ వేళ పతంగులకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పండుగ అంటేనే ఆహ్లాద వాతవరణ నెలకొని ఉంటుంది. ఈ సంక్రాంతికి ఇంటిల్లిపాది ప్రతిఒక్కరూ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. పెద్దలు కూడా చిన్న పిల్లల మాదిరిగా అయిపోయి పంతంగులను ఎగరేస్తారు.

పతంగుల తయారీ దారులు రకరకాల ఆకృతులతో, బొమ్మలతో పతంగులను తయారు చేసి విక్రయిస్తుంటారు. పండుగ నాటికి ఉంటే అప్పటి పరిస్థితులను అనుసరించి బాహుబలి, రోబో, పుష్ప, స్పైడర్ మ్యాన్ వంటి క్రేజీ హీరోల బొమ్మలతో, కార్టూన్ క్యారెక్టర్స్ తో.. జంతువుల బొమ్మలతో రకరకాల పతంగులను తయారు చేస్తుంటారు. కొందరు తమ అభిమాన నాయకులతో కూడిన ఫొటోలతో పతంగులు చేస్తుంటారు. అయితే.. సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగరేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా సంక్రాంతి చలికాలంలో వస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశిస్తాడనే విషయం తెలిసిందే. అందుకే సూర్యుడికి అంకితం చేస్తూ గాలిపటాన్ని ఎగరేస్తారు. అలాగే చలికాలం పూర్తై వసంతంలోకి అడుగుపెడుతున్నామని చెప్పడానికి ఈ పంతంగులను ఎగరేస్తారని పెద్దలు కథలు కథలుగా చెబుతుంటారు.

Advertisement

Also Read: హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్

ఈ క్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్ది ఫొటోతో కూడిన పతంగులు తయారు చేయించి పిల్లలకు ఉచితంగా అందిస్తు తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. గతంలో సీఎం జన్మదినం సందర్భంగా పూరీలో రేవంత్ రెడ్డి సైకత శిల్పం తయారు చేయించిన మెట్టు.. ఈ దఫా సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ ఫొటోతో కూడిన పతంగులను తయారు చేయించి పిల్లలకు పంపిణీ చేస్తుండటం విశేషం. ఈ సందర్భంగా మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రపంచ స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×