CM Revanth Reddy: బ్యూరో స్వేచ్ఛ: మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం సీట్లు సాధించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన పార్టీ ముఖ్య నేతలతో అమెరికా నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ డివిజన్, వార్డూ విజయం కూడా ముఖ్యమేనని చెప్పారు. సర్వేల్లో పాజిటివ్ ఫలితాలు ఉన్నాయని, మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నదిన సీఎం గుర్తు చేశారు. ఈ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతీష్టాత్మకంగానే తీసుకోవాలన్నారు.
రెబల్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ముందస్తుగా మేయర్, చైర్మన్ లను ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించవద్దని సీఎం కోరారు. దీని వలన కొన్ని ప్రాంతాల్లో నష్టాలు జరిగే ప్రమాదం ఉన్నదని సీఎం గుర్తు చేశారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించాలని, తద్వారా ఓట్ బ్యాంక్ పెంచుకోవాలని సీఎం సూచించారు. ఇక ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతి సందర్భంగా సీఎం నివాళులర్పించారు.
Also Read: Honda Monkey 125: సరికొత్త హోండా మంకీ 125 వచ్చేసింది, స్పెషాలిటీ ఏంటో తెలుసా?
అణిచివేతకు వ్యతిరేకంగా తన ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేసిన పోరాట వీరుడు గద్దర్(Gaddar) అంటూ గుర్తు చేశారు. సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడిన గద్దన్ ను అందరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. గద్దర్ జయంతిని ప్రజాప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు ఆయన పేరుతోనూ అవార్డులు ఇస్తుందన్నారు. తెలంగాణ పోరాటంలో గద్దర్ పాత్ర కీయాశీలకమైందన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో ఆయన గొప్ప వీరుడన్నారు. తన పాట, మటలతో తెలంగాణ పబ్లిక్లో ఉద్యమ స్పూర్తిని నిలిపారని వివరించారు.