E-Paper
Advertisement

CM RevanthReddy: సీఎం రేవంత్‌తో అభిషేక్ మను‌సింఘ్వీ భేటీ

CM RevanthReddy: సీఎం రేవంత్‌తో అభిషేక్ మను‌సింఘ్వీ భేటీ
Advertisement

CM RevanthReddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి. ఇరువురు మధ్య దాదాపు పావుగంట సేపు మాట్లాడినట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ నుంచి ఒక సీటు ఉంది.

Advertisement

గతంలో బీఆర్ఎస్‌లోవున్న కె కేశవరావు ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌కి వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజ్యసభ సీటుకు ఉప‌ఎన్నిక అనివార్యమైంది. కేకే ప్లేస్‌లో అభిషేక్ మనుసింఘ్వీకి పెద్దల సభకు పంపించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఆయనకు టికెట్ ఓకే చేసింది కూడా.

ALSO READ: హరీశ్ రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలు

Advertisement

సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు అభిషేక్ మనుసింఘ్వీ. 2001 నుంచి పార్టీ అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు. రెండుసార్లు పెద్దల సభకు ఎన్నికయ్యారు. అయితే ఈ ఏడాది మొదట్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

ఆయన అనుభవాన్ని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు, మనుసింఘ్వీని రాజ్యసభకు పంపాలని నిర్ణయించు కుంది. ఈనెల 21న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. 27న నామినేషన్ ఉప సంహరణ ప్రక్రియకు గడువు ఉంది. సెప్టెంబర్ మూడున పోలింగ్ జరగనుంది.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.

Related News

కొండా‌ సురేఖ ఆసక్తికర పోస్టు.. త్వరలో భారీ అప్‌డేట్, అసలు మేటరేంటి?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×