BigTV English

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

Telangana: గాంధీభవన్‌లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం

Telangana: గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. మశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులపై చర్చించారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రధానంగా చర్చించారు. దళితులను కించపరిచారని ఆయనపై ఫిర్యాదు చేశారు గజ్వేల్ దళిత నేతలు. దీనిపై చర్చించిన కమిటీ..నర్సారెడ్డికి నోటీసులు ఇచ్చింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది.


గజ్వేల్‌లో.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాల చేస్తున్నారని హరికృష్ణపై సిద్దపేట లోకల్ నేతలు ఫిర్యాదు..
దాంతో పాటుగా గజ్వేల్‌లో.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని పూజల హరికృష్ణ పై ఇటీవల సిద్దిపేట లోకల్ నేతల ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా కమటీ చర్చించింది. ఫిర్యాదు ను క్రమశిక్షణ కమిటీకి పంపారు పీసీసీ చీఫ్. దీంతో హరిక్రిష్ణకు షోకాజ్ నోటీస్ పంపింది క్రమశిక్షణ కమిటీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.

తప్పుడు కేసులతో అట్రాసిటీ కేసు పెట్టారని ఆరోపించిన నర్సారెడ్డి..
తనపై వచ్చిన కంప్లైంట్‌పై స్పందించారు డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి. తానేప్పుడు దళితులకు వ్యతిరేకంగా మాట్లాడులేదన్నారు. తనపై వచ్చినకంప్లైంట్‌పై.. పీపీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు నర్సారెడ్డి. తనపై కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి .. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయలేదన్నారు నర్సారెడ్డి.


వారంలో వివరణ ఇవ్వాలని నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఆదేశం
ఇక క్రమశిక్షణ కమిటీలో చర్చించిన అంశాలపై స్పందించారు కమిటీ ఛైర్మన్ మల్లు రవి. సిద్దిపేట డీసీసీ నర్సారెడ్డి పై గజ్వేల్ దలితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై నర్సారెడ్డిని వివరణ కోరామన్నారు.

రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి రాలేదన్న మల్లు రవి
రాజగోపాల్ రెడ్డి అంశంపై కంప్లైంట్ రాలేదని.. వస్తే చర్చిస్తామని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్‌లో చేరికలను ఆహ్వానిస్తున్నామని.. ఇంట్రెస్ట్ ఉన్న వారంతా చేరాలని పిలుపునిచ్చారు. వరంగల్ పంచాయతీ పై పీసీసీ ఛీఫ్‌కు ,సీఎంకు రిపోర్ట్ ఇచ్చామని.. ఫైనల్ నిర్ణయం వారి తీసుకుంటారని తెలిపారు.

Also Read: దారుణం.. కన్న కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి..

పార్టీ ఫిరాయింపులపై మట్లాడే అర్హత కేటీఆర్‌కే లేదు- మల్లు
ఈ రోజు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్న కేటీఆర్, హరీష్.. ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లోకి తీసుకున్నప్పుడు వారి బుద్ది ఏమైందని మల్లు రవి ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే బీఆర్ఎస్ నాటకాలు ఆడుతుందన్నారు.

Related News

Honey Trap: హనీట్రాప్‌లో యోగా గురువు.. ఇద్దరు మహిళలతో వల, చివరకు ఏమైంది?

GHMC Rules: రోడ్డుపై చెత్త వేస్తే జైలు శిక్ష..హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్

Be Alert: హైదరాబాద్‌లో శృతి మించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

Telangana Politics: స్పీకర్ వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌కు మరోసారి వరద ఉధృతి.. 26 గేట్ల ద్వారా నీటి విడుదల

CM Progress Report: రేవంత్ మార్క్.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు ఇవే..!

AP-Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో అలర్ట్, పిడుగులు పడే అవకాశం

Big Stories

×