E-Paper
Advertisement

Municipal Results 2026: సంబురాలకు సిద్ధమైన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లో గెలుపు ధీమా!

Municipal Results 2026: సంబురాలకు సిద్ధమైన కాంగ్రెస్.. మున్సిపాలిటీల్లో గెలుపు ధీమా!
Advertisement

Municipal Results 2026:  రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ  ప్రారంభం.  పోలింగ్ ముగిసినప్పటి నుండి గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, వెలువడబోయే ఫలితాలను పండుగలా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. గ్రౌండ్ లెవల్లో భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాలని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు కావడంతో, ఈ ఫలితాలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. మెజారిటీ మున్సిపాలిటీలు తమ ఖాతాలోనే పడతాయని ఎగ్జిట్ పోల్స్, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.దీనిలో భాగంగానే జిల్లా కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల వద్ద విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు డీసీసీ అధ్యక్షులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ ప్రజల మధ్యే వేడుకలు జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read:North Korea: ఉత్తర కొరియాలో కొత్త పరిణామాలు.. కిమ్ స్థానంలోకి కూతురు, వరుస కార్యక్రమాలకు హాజరు 

గాంధీభవన్ లో సంబురాలు

Advertisement

ముస్తాబైన గాంధీ భవన్.. రాష్ట్ర రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌లో ఇప్పటికే సందడి నెలకొంది. పార్టీ ముఖ్య నేతలు ఫలితాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ద్వారా గాంధీభవన్ లో సంబురాలు నిర్వహించాలని పార్టీ అన్ని ఏర్పాట్లూ చేస్తోన్నది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ తదితర యువజన కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఫలితాలు పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమాలు చేయాలని పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలకు ఆదేశాలిచ్చారు.

​అభివృద్ధి నినాదానికే పట్టం?

​ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధిపై కాంగ్రెస్ చేసిన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఇచ్చిన హామీలే తమను గెలిపిస్తాయని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉన్నదని, అందుకే 70 శాతానికి పైగా సీట్లు సాధిస్తామని పార్టీ భావిస్తున్నది. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత రెగ్యులర్ ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement

Also Read:CM Revanth Reddy: దిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం వరుస భేటీలు.. రాహుల్, ఖర్గేలకు నివేదికలు అందజేత 

Related News

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

బహదూర్‌గూడలో హైటెన్షన్.. పోలీసులపై కారం చల్లి, కుర్చీలు విసిరేసి రైతులు.. ఎందుకంటే?

Food Adulteration Law: ఆహార కల్తీ దందాకు ఇక చెక్.. తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టం ఇదే!

ఉప్పల్‌‌లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?

హై అలర్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్!

Bike Theft Gang: షామీర్‌పేటలో బైక్ దొంగల ముఠా అరెస్ట్.. ఎక్కడ దాచారో తెలిస్తే మీ మైండ్ బ్లాకే!

నింగికి నిచ్చెన వేసిన తెలుగు శాస్త్రవేత్తలు.. ‘స్కైరూట్’ సృష్టికర్తల సక్సెస్ స్టోరీ!

Big Stories

Advertisement
×