TV Ads: స్వేచ్ఛ బ్యూరో: టీవీ ఛానళ్లలో వచ్చే కమర్షియల్ వాణిజ్య ప్రకటనలపై ఢీల్లీ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. గంటకు గరిష్టంగా 12నిమిషాలకే యాడ్స్ ను పరిమితం చేయాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెచ్చిన నిబంధనను సమర్థించింది. దశాబ్ధ కాలం క్రితం ట్రాయ్ తెచ్చిన ఈ నిబంధనను సవాల్ చేస్తూ పలువురు బ్రాడ్ కాస్టర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read: గాంధీభవన్ను షేక్ చేస్తున్న పైరవీల చిట్టా.. ఉద్యోగాల పేరిట భారీ మోసం..!
జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ అమిత్ మహాజన్తో కూడిన డివిజన్ బెంచ్ వీటిపై శుక్రవారం విచారణ జరిపింది. గంటకు 10 నిమిషాలు వాణిజ్య ప్రకటనలు, 2నిమిషాలు స్వీయ ప్రచార కంటెంట్ ఉండాలంటూ ట్రాయ్ అమల్లోకి తెచ్చిన నిబంధన వల్ల ఛానళ్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బ తింటోందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. విచారణ పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు ట్రాయ్ నిబంధనలు సరైనవే అని సమర్థిస్తూ తీర్పు చెప్పింది.
Also read: కల్తీ పెరుగు గుట్టు రట్టు.. తప్పును ఓప్పుకొని క్షమాపన చెప్పిన డైరీ ఓనర్!