Dairy Adulteration: స్వేచ్ఛ బ్యూరో: డైరీ లో జరుగుతున్న కల్తీ ని వార్తలు రూపంలో రాసిన విలేకరులపై అసత్య ఆరోపణలు చేసిన వి ఎల్ ఆర్ డెయిరీ యజమాని నెల్లి ప్రవీణ్ తన తప్పును ఒప్పుకున్నా రు. హుజూరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ కరుణాకర్ సమక్షంలో వి ఎల్ ఆర్ డెయిరీ యజమాని నెల్లి ప్రవీణ్. జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.
సైదాపూర్ రోడ్డులోని వి ఎల్ ఆర్ డెయిరీలో సాగుతున్న కల్తీ వ్యాపారంపై పత్రికల్లో కథనాలు రావడంతో ఆహార భద్రతా అధికారులు దాడులు చేసి పెరుగు నమూనాలను సేకరించారు. హైదరాబాద్ స్టేట్ ఫుడ్ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో సదరు పెరుగు ‘సబ్స్టాండర్డ్’ (నాణ్యత లేనిది) అని, తేలింది.
Also Read: Mining Course: సీఎం రేవంత్కు మంత్రి పొన్నం లేఖ..!
కల్తీ గుట్టు బయటపడటంతో డెయిరీ యజమాని విలేకరులపై బురదజల్లే ప్రయత్నం చేశారు. జర్నలిస్టులు తనను డబ్బులు డిమాండ్ చేశారంటూ డెయిరీ ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై విలేకరుల యూనియన్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేస్తామనడంతో.. యజమాని వెనక్కి తగ్గారు.వెంటనే డైరీ ముందు ఫ్లెక్సీ నీ తొలగించారు. ల్యాబ్ రిపోర్టులో తప్పు రుజువు కావడం, విలేకరులపై తప్పుడు ఆరోపణలు చేయడం తన పొరపాటేనని అంగీకరిస్తూ, సీఐ ఎదుట విలేకరులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.
Also Read: ఢిల్లీ పీఠాన్ని శాసిస్తున్న ప్రాంతీయ శక్తులు.. కింగ్ మేకర్ల చేతిలో జాతీయ పార్టీల జాతకం!