E-Paper
Advertisement

Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ యాక్షన్.. 48 గంటల పాటు నిషేధం..

Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ యాక్షన్.. 48 గంటల పాటు నిషేధం..
Advertisement

Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మునుగోడులో ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. సభలు, ర్యాలీలు, మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.

మంత్రి జగదీష్ రెడ్డి ఓటర్లను బెదిరించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయంటూ ఆయన ఓటర్లను బెదిరించినట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. జగదీష్ రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండు రోజుల పాటు నిషేధించడం సంచలనంగా మారింది.

Advertisement

పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఈసీ నిర్ణయం టీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. మునుగోడు గెలుపు బాధ్యతలు పూర్తిగా మంత్రి జగదీష్ రెడ్డి మీదనే ఉన్నాయి. మొదటి నుంచీ మునుగోడులో అంతా తానై వ్యవహారం చక్కబెడుతున్నారు. అలాంటిది ఇంతటి కీలక సమయంలో జగదీష్ రెడ్డిపై ఈసీ వేటు వేయడం పార్టీ ఓటింగ్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

అయితే, కావాలనే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి.. ఆయనపై నిషేధం విధించేలా ఒత్తిడి తీసుకొచ్చిందంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×