BigTV English

Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ యాక్షన్.. 48 గంటల పాటు నిషేధం..

Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ యాక్షన్.. 48 గంటల పాటు నిషేధం..

Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. 48 గంటల పాటు మునుగోడులో ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. సభలు, ర్యాలీలు, మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది.


మంత్రి జగదీష్ రెడ్డి ఓటర్లను బెదిరించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయంటూ ఆయన ఓటర్లను బెదిరించినట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. జగదీష్ రెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా రెండు రోజుల పాటు నిషేధించడం సంచలనంగా మారింది.

పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఈసీ నిర్ణయం టీఆర్ఎస్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. మునుగోడు గెలుపు బాధ్యతలు పూర్తిగా మంత్రి జగదీష్ రెడ్డి మీదనే ఉన్నాయి. మొదటి నుంచీ మునుగోడులో అంతా తానై వ్యవహారం చక్కబెడుతున్నారు. అలాంటిది ఇంతటి కీలక సమయంలో జగదీష్ రెడ్డిపై ఈసీ వేటు వేయడం పార్టీ ఓటింగ్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు.


అయితే, కావాలనే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి.. ఆయనపై నిషేధం విధించేలా ఒత్తిడి తీసుకొచ్చిందంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది.

Tags

Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×