E-Paper

Fake Witnesses: గద్వాల రిజిస్ట్రార్ ఆఫీస్‌లో.. సాక్షి సంతకాల దందా కలకలం!

Fake Witnesses: గద్వాల రిజిస్ట్రార్ ఆఫీస్‌లో.. సాక్షి సంతకాల దందా కలకలం!
Advertisement

Fake Witnesses: స్వేచ్ఛ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకమైన ‘సాక్షి సంతకాలు’ ఇప్పుడు బహిరంగంగానే విక్రయ వస్తువులుగా మారిపోయాయి. కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన కొంతమంది మధ్యవర్తులు, బ్రోకర్లు సాక్షులు”గా అవతారమెత్తి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు.

అంగట్లో సాక్షులు.. ఒక్కొక్కరికి రేటు

నిజానికి రిజిస్ట్రేషన్ సమయంలో కొనేవారికి, అమ్మేవారికి ఇరుపక్షాల తరపున తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు సాక్షులుగా సంతకాలు చేయాలి. కానీ గద్వాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కథ వేరుగా ఉంది. ప్లాట్లు, స్థలాల క్రయవిక్రయదారులతో ఎలాంటి పరిచయం లేకపోయినా, అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకపోయినా.. కేవలం డబ్బుల కోసం సాక్షి సంతకాలు పెట్టే ముఠాలు ఇక్కడ తయారయ్యాయి. కొంతమంది మధ్యవర్తులు ఒక్కో సంతకానికి ఇంత అని రేటు ఫిక్స్ చేసి, కొనుగోలుదారుల నుంచి వసూలు చేస్తూ ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు.

Advertisement

Also read: Greenfield Airport: భద్రాద్రి జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు స్థలాలు ఖరారు..!

రోజుకు పది సాక్షి సంతకాలు!

కార్యాలయం చుట్టూ తిరిగే కొద్దిమంది వ్యక్తులే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే వేర్వేరు రిజిస్ట్రేషన్లలో సాక్షులుగా మారుతుండటం గమనార్హం. ఒక్కొక్కరు రోజుకు పదికి పైగా డాక్యుమెంట్లపై సాక్షి సంతకాలు పెడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి డాక్యుమెంట్‌కు ఆధార్ కార్డు, వేలిముద్రలు సేకరిస్తున్నప్పటికీ, ఒకే వ్యక్తి రోజూ ఇన్ని సంతకాలు పెడుతుంటే అధికారులు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తులో తీవ్ర వివాదాలకు దారితీసే ప్రమాదం..

Advertisement

ఈ సాక్షుల వల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తినప్పుడు అసలైన కొనుగోలుదారులు, అమ్మకందారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చినప్పుడు ఈ నకిలీ సాక్షులు ఆ దస్తావేజులను నిరూపించలేరని, దీనివల్ల అమాయక ప్రజలు మోసపోతారని మేధావులు హెచ్చరిస్తున్నారు. గద్వాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సాగుతున్న ఈ ‘ సాక్షుల’ దందాపై రిజిస్ట్రేషన్ అధికారులు తక్షణమే స్పందించాలని, రోజువారీ రిజిస్ట్రేషన్లలో ఒకే వ్యక్తి పదే పదే సాక్షిగా రాకుండా ఆధార్ డేటా ఆధారంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న మధ్యవర్తులపై సంబంధిత జిల్లా అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

Also read: Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!

Related News

సింగరేణి మనుగడకు కొత్త ప్లాన్.. రాబోయే 15 ఏళ్ల కోసం కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు!

Free Feeder: బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్.. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..!

రంకెలతో అంకెలు మారవు.. ఏ చర్చకైనా సిద్ధం.. హరీశ్ రావు సవాల్!

‘అరుంధతి పశుపతిలా కేసీఆర్‌ను బంధించారు’.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Farmhouse Rules: హైదరాబాద్ ఫార్మ్‌హౌస్ ఓనర్లకు కొత్త రూల్స్.. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే ఫార్మ్‌హౌస్‌లు సీజ్!

Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!

ఉప్పల్‌లో దారుణం.. భార్యను చంపి.. బావమరదలికి ఫోన్ చేసిన భర్త!

Big Stories

×