E-Paper
Advertisement

ఉప్పల్‌లో దారుణం.. భార్యను చంపి.. బావమరదలికి ఫోన్ చేసిన భర్త!

ఉప్పల్‌లో దారుణం.. భార్యను చంపి.. బావమరదలికి ఫోన్ చేసిన భర్త!
Advertisement

Uppal: స్వేచ్ఛ బ్యూరో: కలిసి నూరేళ్లు బతకాల్సిన భార్యాభర్తల మధ్య అనుమానం అనే భూతం పెను విపత్తును తెచ్చిపెట్టింది. క్షణికావేశంలో ఓ భర్త చేసిన దారుణం ఒకరి ప్రాణాన్ని తీయడమే కాకుండా, కన్నకూతురిని అనాథను చేసింది. అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై స్వయంగా బావమరిదికో, ఆమె సోదరికో ఫోన్ చేసి చెప్పిన ఈ షాకింగ్ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ లో తీవ్ర కలకలం రేపింది.

ప్రేమగా సాగిన సంసారంలో అనుమానం

Advertisement

పోలీసుల వివరాల ప్రకారం.. చిలుకానగర్ లో నివాసముంటున్న సురేశ్, జెస్సికా దంపతులు. జెస్సికా ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, సురేశ్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఒక చిన్న కూతురు కూడా ఉంది. ఉద్యోగాలు చేసుకుంటూ సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో కొద్దిరోజులుగా కలతలు మొదలయ్యాయి. జెస్సికా ప్రవర్తనపై సురేశ్ మనసులో అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ తీవ్రమైన గొడవలు జరుగుతుండేవి.

Also Read: కాళేశ్వరం నిర్వహణపై నో రాజీ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

క్షణికావేశంలో దారుణం.. ఆపై ఫోన్ కాల్

శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఇదే విషయమై పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సురేశ్ కోపంతో విచక్షణ కోల్పోయాడు. ఇంట్లో ఉన్న వస్తువుతో జెస్సికాపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. రక్తం మడుగులో భార్య ప్రాణాలు విడవడం చూసి ఒక్కసారిగా తేరుకున్న సురేశ్.. వెంటనే జెస్సికా అక్కకు ఫోన్ చేసి, తానే హత్య చేసినట్లు చెప్పాడు.

రంగంలోకి దిగిన పోలీసులు

ఈ షాకింగ్ సమాచారంతో హతాశురాలైన జెస్సికా సోదరి వెంటనే ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడు సురేశ్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఒక చిన్న అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×