Rythu Bharosa: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం కేవలం 5 రోజుల వ్యవధిలోనే రూ.7,135.77 కోట్లను 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో రికార్డును సృష్టించింది.
రైతు భరోసా పథకం ఐదో విడతలో 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు శనివారం రూ.545.41 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.69 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం పొందారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Also read: Annam Foundation: కేసముద్రం బడి తండాలో హార్ట్ టచింగ్ సీన్.. బిగ్ టీవీ వార్తతో యువకుడికి పునర్జన్మ!
ఇప్పటికే తొలి నాలుగు విడతలలో 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశామని ప్రభుత్వం వెల్లడించారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
Also read: HYDRAA: ఐదేళ్ల పోరాటం.. 250 కుటుంబాల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా..!