E-Paper
Advertisement

Bandi sanjay vs Etela: కమలంలో కలహాలు? ఆ పదవి కోసం పంతం, రేసులో కొత్త పేరు

Bandi sanjay vs Etela: కమలంలో కలహాలు? ఆ పదవి కోసం పంతం, రేసులో కొత్త పేరు
Advertisement

Bandi sanjay vs Etela(BJP news in Telangana): తెలంగాణలో బీజేపీ పరిస్థితి? హైకమాండ్ ఎందుకు సైలెంట్‌గా ఉంది? కాంగ్రెస్ ప్రత్యామ్నాయం తామేనని బయటకు చెబుతున్నా.. ఆ లోటును ఎందుకు భర్తీ చేయలేకపోతోంది? అధ్యక్ష పదవిని ఎందుకు పెండింగ్‌లో పెట్టింది? తెలంగాణ బీజేపీలో గ్రూపుల రాజకీయం మొదలయ్యిందా? ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు ఎంపిక లేనట్టేనా? బీఆర్ఎస్ దోస్తీ నేపథ్యంలో అధ్యక్ష పీఠాన్ని పెండింగ్‌లో పెట్టిందా? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

తెలంగాణ కమలంలో అంతర్గత కలహాలు ముదిరిపాకాన పడినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీలోని నేతలు ఎవరి కివారే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన ఆ పార్టీ నేతల సమావేశానికి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. రకరకాల కారణాలు చెప్పారనుకోండి. అదంతా తర్వాత విషయం. నేతలంతా ఒకతాటి మీదకు రాకపోవడంతో తెలంగాణ అధ్యక్షుడ్ని నియమించలేదన్నది బీజేపీ హైకమాండ్ నుంచి ఓ ఫీలర్ బయటకువచ్చింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే దీనికి కారణంగా తెలుస్తోంది.

Advertisement

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మంత్రి బండి సంజయ్-ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఈటెలకు పదవి రాకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నా రన్నది కొందరి నేతల అభిప్రాయం. అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కర్చీఫ్ వేశారు ఈటెల రాజేందర్. ఆయనకు ఆ పదవి రాకుండా సంజయ్ తెరవెనుక పావులు కదుపుతున్నారన్నది పొలిటికల్ సమాచారం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఇద్దరు నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి.. కాగ్నిజెంట్‌ న్యూ‌ క్యాంపస్‌ శంకుస్థాపన, కేవలం 9 రోజుల్లో..

Advertisement

ఈటెలకు పోటీగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. రాంచందర్‌రావు గురించి చెప్పనక్కర్లేదు. బీజేపీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కూడా.. ఇంతకంటే సౌమ్యుడు ఉండరన్నది బండి సంజయ్ మద్దతుదారులు చెబుతున్నమాట. దీంతో తెలంగాణ అధ్యక్ష పీఠంపై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చుకోలేపోతోంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు బీజేపీ పెద్దలు.

ప్రస్తుతం కిషన్‌రెడ్డి కంటిన్యూ చేయాలనే ఆలోచన చేస్తోందట బీజేపీ హైకమాండ్. కొత్తవారికి అధ్యక్ష పదవి ఇస్తే మరో గ్రూపు తయారవుతుందని భావిస్తోందట. కొద్దిరోజులు అలాగే ఉంచాలన్నది హైకమాండ్ ఆలోచన గా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠంపై కొద్దిరోజులు ఉత్కంఠ కొనసాగడం ఖాయమన్నమాట.

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×